యాప్నగరం

మృత్యువును జయించిన చిన్నారి.. బోరుబావి నుంచి క్షేమంగా బయటకు!

మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా కెర్హర్‌ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు తేజ్ ప్రతాప్ ఆదివారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయాడు.

Samayam Telugu 28 Jan 2019, 9:56 am
ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారి తేజ్ ప్రతాప్ సింగ్‌ను క్షేమంగా బయటకు తీసుకొచ్చారు. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి జిల్లా కెర్హర్‌ గ్రామానికి చెందిన రెండేళ్ల బాలుడు తేజ్ ప్రతాప్ ఆదివారం ఉదయం ఆడుకుంటూ వెళ్లి 70 అడుగుల లోతున్న బోరుబావిలో పడిపోయాడు. దీని గురించి సమాచారం అందుకున్న అధికారులు, సహాయక సిబ్బంది 45 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. తక్షణమే సహాయక చర్యలను ప్రారంభించి, బోరు బావికి సమాంతరంగా మరో రంధ్రాన్ని తవ్వి చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు. వెంటనే బాలుడిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బాలుడికి చిన్నపాటి గాయం కూడా అవ్వలేదని, క్షేమంగా ఉన్నాడని అధికారులు వెల్లడించారు. వైద్య పరీక్షల అనంతరం బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తామని తెలిపారు. అనుమతులు లేకుండా బోరుబావి తవ్విన యజమానిపై కేసు నమోదు చేయనున్నట్టు సింగ్రౌలీ కలెక్టర్ అనురాగ్ చౌధురి పేర్కొన్నారు.
Samayam Telugu mp


చిన్నారి బారుబోవిలో పడిపోయిన విషయం తెలియగానే అధికారులను అప్రమత్తం చేశామని అన్నారు. సమాంతరంగా పది అడుగులు వెడల్పుతో మరో బావి తవ్వి, బాలుడ్ని క్షేమంగా బయటకు తీసినట్టు ఆయన తెలియజేశారు. అధికారుల ప్రయత్నాలకు దేవుడు ఆశీస్సులతో తోడుకావడంతో బాలుడు ప్రాణాలతో బయటపడ్డాడు. దాదాపు 10 గంటలపాటు ఈ ఆపరేషన్ కొనసాగింది. సింగ్రౌలీ జిల్లాలో నాలుగేళ్ల కిందట ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. బోరుబావిలో పడిన చిన్నారిని సురక్షితంగా బయటకు తీశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.