యాప్నగరం

ప్రభుత్వ ఉద్యోగులు జీన్స్‌, టీషర్ట్ ధరించొద్దు.. సర్కార్ కీలక ఆదేశాలు

Govt Employees: గత నెల 20న ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి ఓ అధికారి టీ షర్టు ధరించి వచ్చారు. ఈ ఘటనపై సీఎం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.

Samayam Telugu 1 Aug 2020, 10:49 pm
ప్రభుత్వ ఉద్యోగులు బట్టలు ధరించే విషయంలో మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. సర్కారీ కొలువుల్లో ఉన్నవారు కచ్చితంగా ఆ నిబంధనలు పాటించాల్సిందేనని తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఉద్యోగులు టీ షర్టులు, జీన్స్‌లు ధరించవద్దని ఆదేశించింది. విధులకు హాజరయ్యే సమయంలో ఉద్యోగులు టీ షర్టు ధరించడం హుందాతనం కాదని ఉత్తర్వులలో తెలిపింది. గ్వాలియర్‌ డివిజన్‌లోని ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు తమ విధులకు హాజరయ్యేటప్పుడు జీన్స్‌, టీ షర్టులు ధరించడంపై నిషేధం విధించింది. దీనికి సంబంధించిన డివిజనల్‌ కమిషనర్‌ ఎంబీ ఓజా సర్క్యూలర్‌ జారీ చేశారు. ఉద్యోగులందరూ హుందాగా, సంప్రదాయంగా ఉండే దుస్తులను ధరించి కార్యాలయాలకు రావాలని ఆదేశించారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం (Picture Credit: Pixabay)
madhya pradesh govt bans employees


గత నెల 20న మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అధ్యక్షతన జరిగిన ఓ సమావేశానికి మాండ్‌సౌర్‌ జిల్లాలోని ఓ అధికారి టీ షర్టు ధరించి వచ్చారు. ఈ ఘటనపై సీఎం తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు గౌరవమైన, సంప్రదాయ దుస్తులు ధరించి విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.