యాప్నగరం

7.5 క్యారెట్ల వజ్రాలు దొరికాయి.. కూలీ పంట పండింది

Madhya Pradesh: పన్నా గనుల్లో ఓ కూలీకి ఒకేసారి 3 వజ్రాలు దొరికాయి. రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారాడు. ఆ డైమండ్స్‌ను నేరుగా తీసుకెళ్లి జిల్లా వజ్రాల కేంద్రంలో డిపాజిట్ చేశాడు.

Samayam Telugu 7 Aug 2020, 8:52 pm
కూలీ పంట పండింది. ఒకటి కాదు, రెండు కాదు.. ఒకేసారి మూడు వజ్రాలు దొరికాయి. దీంతో రాత్రికి రాత్రే లక్షాధికారిగా మారే అవకాశం దక్కింది. మధ్యప్రదేశ్‌లోని పన్నాలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ కార్మికుడు తనకు దొరికిన వజ్రాలను జిల్లా వజ్రాల కేంద్రానికి అప్పగించాడు. వాటి విలువ రూ. 30 లక్షల నుంచి రూ. 35 లక్షల వరకూ ఉంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
Samayam Telugu madhya pradesh labourer finds 3 diamonds worth rs 35 lakh in panna mines
7.5 క్యారెట్ల వజ్రాలు దొరికాయి.. కూలీ పంట పండింది


సుబాల్‌ అనే కార్మికుడు పన్నా జిల్లాలోని ఓ గనిలో కొన్ని రోజులుగా తవ్వకాలు జరుపుతుండగా.. అతడికి 7.5 క్యారెట్ల వజ్రాలు దొరికాయి. వెంటనే వాటిని వజ్రాల బ్యాంక్‌లో డిపాజిట్ చేశాడు. ప్రభుత్వ నిబంధనల మేరకు వాటిని వేలం వేస్తామని అధికారులు తెలిపారు. వేలం తర్వాత 12 శాతం పన్నును మినహాయించుకుని, మిగిలిన 88 శాతం మొత్తాన్ని సుబాల్‌కు అందిస్తామని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే తెలిపారు.

కొన్ని రోజుల కిందట బుందేల్‌ఖండ్ రీజియన్‌లోని మరో గనిలో ఓ కార్మికుడికి 10.69 క్యారెట్ల విలువైన వజ్రాలు లభించాయి. దేశంలోని అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటైన పన్నా జిల్లా వజ్రాల గనులకు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి గాంచింది. ఇక్కడి గనుల్లో నిత్యం వందలాది మంది కార్మికులు వజ్రాల కోసం అన్వేషణలు సాగిస్తుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.