యాప్నగరం

Mumbai Chef Corona Death: మధ్యప్రదేశ్‌లో తొలి కరోనా మరణం.. ముంబై ఫేమస్ చెఫ్ కోవిడ్‌కు బలి

MP Covid Death | కరోనా వైరస్ కారణంగా మధ్యప్రదేశ్‌లో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముంబైకి చెందిన ఫేమస్ చెఫ్ ఒకరు కోవిడ్ బారిన పడి అమెరికాలో మరణించారు.

Samayam Telugu 25 Mar 2020, 7:51 pm
మధ్యప్రదేశ్‌లో తొలి కరోనా మరణం చోటు చేసుకుంది. ఉజ్జయినికి చెందిన 65 ఏళ్ల మహిళ ఇండోర్‌లో నోవల్ కరోనా వైరస్‌కు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారని న్యూస్ ఏజెన్సీ పీటీఐ తెలిపింది. దీంతో దేశంలో కోవిడ్ మరణాల సంఖ్య 11కు చేరింది. మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ ప్రెస్ మీట్‌కు హాజరైన జర్నలిస్టుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో... ఆ సమావేశానికి హాజరైన జర్నలిస్టులందర్నీ క్వారంటైన్‌కు తరలించారు. కాగా.. ముంబైకి చెందిన ప్రముఖ చెఫ్ ఫ్లయడ్ కార్డోజ్ అమెరికాలో కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఆయన న్యూయార్క్‌లో ‘బాంబే క్యాంటీన్’ పేరిట హోటల్ నడుపుతున్నారు.
Samayam Telugu dead


మరోవైపు దేశంలో కోవిడ్ బాధితుల సంఖ్య బుధవారం సాయంత్రానికి 606కు చేరిందని కేంద్రం ప్రకటించింది. కేరళలో 9 కోవిడ్ పాజిటివ్ కేసులను గుర్తించారు. దీంతో ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 106కి చేరింది. కాగా కరోనా పేషెంట్లలో ఆరుగురికి నెగటివ్ వచ్చిందని కేరళ ప్రభుత్వం తెలిపింది. కశ్మీర్‌లో నలుగురికి కోవిడ్ సోకినట్లు తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో కోవిడ్ కేసుల సంఖ్య 11కి చేరింది. ఛత్తీస్‌‌గఢ్‌లో మరో ఇద్దరికి కరోనా సోకగా.. మొత్తం కేసుల సంఖ్య మూడుకి పెరిగింది. ఢిల్లీలో ఐదు, పంజాబ్‌లో రెండు చొప్పున కోవిడ్ కేసులు నమోదయ్యాయి.

కరోనా వైరస్‌ను కట్టడి చేయడం కోసం కేంద్రం డిజాస్టర్ మేనేజ్‌మెంట్ యాక్ట్‌ను అమలు చేసింది. బుధవారం సాయంత్రానికి భారత్‌లోని యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 512గా నమోదైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.