ఆధ్యాత్మిక గురువు నిత్యానందను అరెస్టు చేయాలని మద్రాస్ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు సమాచారంతో న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించేందుకు నిత్యానంద ప్రయత్నించారంటూ జస్టిస్ ఆర్.మాధవన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అధ్యాత్మిక గురువులు చట్టం కంటె పెద్దవాళ్లేమి కాదని అన్నారు. బుధవారంలోగా నిత్యానందను అరెస్టు చేసి కోర్టు హాళ్లో ప్రవేశపెట్టాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు కేసు విచారణ జరుగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా నిత్యానంద శిష్యుడు కోర్టు హాల్లోకి మోబైల్ ఫోన్ తీసుకురావడమే కాకుండా కోర్టు హాలు నుంచి ఎస్.ఎం.ఎస్లు పంపడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు వ్యక్తి నుంచి మోబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు విచారణకు సంబంధించిన సమాచారాన్ని ఎస్.ఎం.ఎస్ల రూపంలో పంపి ఉంటే కేసు నమోదు చేయాలని సూచించారు.
మధురై మఠం వ్యవహారాల్లో స్వామి నిత్యానంద జోక్యం చేసుకోకుండా తగు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో నిత్యానంద కోర్టుకు తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఈ విషయాన్ని పసిగట్టిన న్యాయమూర్తి సరైన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని నిత్యానంద తరపు న్యాయవాదికి సూచించినప్పటికీ ఆయన లెక్కచేయకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హెచ్చరించారు.
మరోవైపు కేసు విచారణ జరుగుతుండగా నిబంధనలకు విరుద్ధంగా నిత్యానంద శిష్యుడు కోర్టు హాల్లోకి మోబైల్ ఫోన్ తీసుకురావడమే కాకుండా కోర్టు హాలు నుంచి ఎస్.ఎం.ఎస్లు పంపడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. సదరు వ్యక్తి నుంచి మోబైల్ ఫోన్ స్వాధీనం చేసుకోవాలని పోలీసులను ఆదేశించారు. కోర్టు విచారణకు సంబంధించిన సమాచారాన్ని ఎస్.ఎం.ఎస్ల రూపంలో పంపి ఉంటే కేసు నమోదు చేయాలని సూచించారు.
మధురై మఠం వ్యవహారాల్లో స్వామి నిత్యానంద జోక్యం చేసుకోకుండా తగు మార్గదర్శకాలు జారీ చేయాలని కోరుతూ ఓ వ్యక్తి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో నిత్యానంద కోర్టుకు తప్పుడు సమాచారాన్ని అఫిడవిట్ రూపంలో సమర్పించారు. ఈ విషయాన్ని పసిగట్టిన న్యాయమూర్తి సరైన వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని నిత్యానంద తరపు న్యాయవాదికి సూచించినప్పటికీ ఆయన లెక్కచేయకపోవడంతో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయని హెచ్చరించారు.