యాప్నగరం

జగన్ సర్కారు బాటలో మహారాష్ట్ర కొత్త సర్కారు.. శివసేన ఊహించని రీతిలో..

Maharashtra సీఎంగా ఉద్దవ్ థాక్రే ప్రమాణం చేశారు. అదే రోజున మహా వికాస్ అఘాడీ కనీస ఉమ్మడి కార్యచరణను ప్రకటించింది. తమ ప్రభుత్వ ప్రాధాన్యాలను వివరించింది.

Samayam Telugu 28 Nov 2019, 11:23 pm
మహారాష్ట్రలోని శివసేన- ఎన్సీపీ - కాంగ్రెస్ సంకీర్ణం కనీస ఉమ్మడి కార్యచరణ (సీఎంపీ)ను ప్రకటించింది. దీని ప్రకారం హిందూత్వ రాజకీయాలకు ప్రసిద్ధి చెందిన ఉద్ధవ్ థాక్రే.. ఇక నుంచి సెక్యులర్ ప్రభుత్వాన్ని నడపనున్నారు. తొలుత లౌకిక వాద అనే పదాన్ని సీఎంపీలో చేర్చడానికి శివసేన అంగీకరించలేదు. కానీ లౌకికవాదాన్ని తొలి అంశంగా చేర్చడం గమనార్హం. తొలి పేరాలోనే లౌకికవాదం అనే పదాన్ని రెండుసార్లు ఉపయోగించారు.
Samayam Telugu జగన్, ఉద్దవ్


రైతుల సమస్యలు, నిరుద్యోగం, ఆరోగ్యం, పరిశ్రమలు, సామాజిక న్యాయం, మహిళలు, విద్య, పట్టణాభివృద్ధి, పర్యాటకం, కళలు తదితర అంశాలను సీఎంపీలో ప్రముఖంగా ప్రస్తావించారు.

ఏపీలో జగన్ సర్కారు స్థానికులకే 75 శాతం ఉద్యోగాలివ్వడానికి చట్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో మహారాష్ట్రలో 80 శాతం ఉద్యోగాలను స్థానికులు, భూమి పుత్రులకే కేటాయించాలని ఉద్దవ్ సర్కారు నిర్ణయించింది. ఈ అంశాన్ని కూడా సీఎంపీలో చేర్చారు. ఇందుకు అనుగుణంగా చట్టం తెస్తామని మహా వికాస్ అఘాడీ మాటిచ్చింది.

తక్షణమే రైతు రుణమాఫీ, రూపాయి క్లినిక్‌లు తదితర అంశాలను సీఎంపీలో చేర్చారు. ఎన్నికల సమయంలో శివసేన రూ.10కే భోజనం అందిస్తామని ప్రచారం చేసింది. ఈ అంశాన్ని కూడా కనీస ఉమ్మడి కార్యచరణలో చేర్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.