యాప్నగరం

మహారాష్ట్రలో కోవిడ్ ఉధృతి.. లాక్‌డౌన్‌పై సీఎం సంచలన వ్యాఖ్యలు

రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా పెరుగుతుండడంతో సీఎం ఉద్దవ్ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కరోనా చైన్‌ను తెంచేందుకు ప్రభుత్వం తీసుకునే కఠిన నిర్ణయాలకు మద్దతు కోరినట్లు తెలుస్తోంది.

Samayam Telugu 10 Apr 2021, 8:35 pm
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకీ లక్షకు పైగా కరోనా కొత్త కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో పరిస్థితి మరింత దిగజారుతోంది. శుక్రవారం ఒక్కరోజే 58 వేలకు పైగా కరోనా కేసులు నమోదవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాక్షికంగా నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. ప్రతిరోజూ సుమారు 50 వేల కేసులు నమోదవుతున్న నేపథ్యంలో మహా సీఎం ఉద్దవ్ థాకరే అఖిల పక్ష నేతల సమావేశం ఏర్పాటు చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
uddav


అఖిలపక్షం భేటీలో లాక్‌డౌన్‌పై సీఎం థాకరే సంచలన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. కరోనా కేసులను నియంత్రించేందుకు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం మినహా మరో గత్యంతరం లేదని ఆయన వ్యాఖ్యానించినట్లు సమాచారం. నెల రోజులు లాక్‌డౌన్ విధిస్తే పరిస్థితి అదుపులోకి వచ్చే అవకాశం ఉందని ఆయన అఖిలపక్ష నేతలతో చెప్పినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోబోయే కఠిన నిర్ణయాలకు అందరూ సహకరించాలని కోరినట్లు సమాచారం. వచ్చేవారంలో మరింత కరోనా కేసులు మరింత పెరిగే అవకాశం ఉందని.. రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించడం ద్వారా కరోనా చైన్‌ను తెంచాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డట్టు తెలుస్తోంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.