యాప్నగరం

మహా విషాదం.. ఒక్కరోజులో అత్యధిక మరణాలు

కరోనా కరాళ నృత్యంతో మహారాష్ట్ర అల్లాడుతోంది. ప్రతిరోజూ సుమారు 70 వేల కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది.

Samayam Telugu 23 Apr 2021, 9:52 pm
మహారాష్ట్రలో కోవిడ్ విజృంభణ కొనసాగుతోంది. రోజుకి 65 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకీ పెరిగిపోతున్న మరణాల సంఖ్య తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 773 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకూ ఒక్కరోజు సంభవించిన మరణాల సంఖ్య రికార్డ్ స్థాయి చేరుకుంది. ఒక్కరోజు కోవిడ్ మరణాల్లో ఇదే అత్యధికం. ఈరోజు రాష్ట్రంలో 66,836 కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే గత 24 గంటల్లో కొత్త కేసుల కంటే డిశ్చార్జి అయిన బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండడం ఉపశమనం. ఈరోజు 74,045 మంది డిశ్చార్జి అయ్యారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
covid death


పూణె, నాగ్‌పూర్‌లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. 24 గంటల్లో పూణెలో 9,863 కొత్త కేసులు నమోదు కాగా.. నాగ్‌పూర్‌లో 7,970 కేసులు నమోదయ్యాయి. ముంబైలో 7221 కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,91,851 యాక్టివ్ కేసులున్నాయని.. మరణాల రేటు 1.52 శాతంగా ఉన్నట్లు తెలిపింది. హోం క్వారంటైన్‌లో 41,88,266 మంది ఉండగా.. 29,378 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. డిశ్చార్జి అయిన వారి సంఖ్య 81.81 శాతంతో 34,04,792గా ఉంది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.