యాప్నగరం

మహారాష్ట్రలో కరోనాతో ఒక్క రోజే 54 మంది మృతి.. 25 వేలు దాటిన కేసులు

Mumbai: మహారాష్ట్రలో కరోనా వైరస్ మృత్యు ఘంటికలు మోగిస్తోంది. ముంబైలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాష్ట్రంలో కరోనా కేసులు 25 వేల మార్కును దాటగా.. మరణాల సంఖ్య 1000కి చేరువైంది.

Samayam Telugu 13 May 2020, 10:56 pm
హారాష్ట్రలో కరోనా మహమ్మారి ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 25 వేల మార్క్ దాటగా.. మరణాల సంఖ్య 1000కి చేరువైంది. బుధవారం (మే 13) ఒక్క రోజే రాష్ట్రంలో 1,495 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. తాజాగా నమోదైన కేసులతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 25,922కు ఎగబాకింది. ఒక్క ముంబైలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 15 వేల మార్క్‌ను దాటింది. ఆసియాలోనే అతిపెద్ద మురికివాడగా పేరు పొందిన ధారావిలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.
Samayam Telugu ముంబైలో పరిస్థితి
Maharashtra coronavirus


కరోనా కారణంగా మహారాష్ట్రలో నేడు ఒక్క రోజే 54 మంది మృతి చెందారు. ముంబై నగరంలోనే 40 మరణాలు సంభవించాయి. కొవిడ్‌-19 కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు 975 మంది మరణించినట్లు మహారాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మహారాష్ట్రలో గత ఆరు రోజులుగా 1000కి పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయంటే.. అక్కడ పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

మహారాష్ట్రంలో 422 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకొని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య 5,547కు చేరుకుంది. ముంబై నగరంలో ఇప్పటికవరకు 2.5 లక్షల నమూనాలను పరీక్షించారు. 3 లక్షల మంది క్వారంటైన్‌లో ఉన్నారు. ముంబై తర్వాత పుణేలో కరోనా కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. ఇప్పటివరకు అక్కడ 2800 కేసులు నమోదయ్యాయి.

Also Read: న్యూయార్క్‌లో మరో మాయ రోగం.. 100 మంది పిల్లలకు అస్వస్థత, ఐదుగురి మృతి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.