యాప్నగరం

ఇంటర్ పాసైన ఒకప్పటి నక్సలైట్.. పోలీస్ కావడమే నా కల అంటోన్న యువతి

ఏడో తరగతి చదువుతోన్న సమయంలో ఓ గిరిజన బాలిక.. ఒక రోజు పశువులను మేపడానికి తన గ్రామం సమీపంలోకి తీసుకెళ్లింది. అయితే, ఆ రోజున కొందరు నక్సల్స్ ఆమెను అపహరించి ఎత్తుకెళ్లారు. ఆమెను తీసుకెళ్లిన అన్నలు.. ఆ బాలికను బలవంతంగా ఉద్యమంలో చేర్పించారు. ఈ క్రమంలో తుపాకులు, ఆయుధాలు వినియోగంలో శిక్షణ ఇప్పించారు. దీంతో నక్సలైట్‌గా మారిన ఆమె పోలీసులపై హింసాత్మక దాడికి పాల్పడింది. కానీ, తనకు ఇష్టం లేకపోవడంతో ఉద్యమం వీడాలని నిర్ణయించుకుంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 28 May 2023, 11:40 am

ప్రధానాంశాలు:

  • నక్సలైట్ ఉద్యమంలోకి బలవంతంగా బాలిక
  • పోలీసుల సాయంతో జనజీవన స్రవంతిలోకి
  • ఆశమ్ర పాఠశాలలో చేరి ఇంటర్‌లో ఉత్తీర్ణత
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Ex Naxal
నక్సలైట్ ఉద్యమంలో చేరి ఒకప్పుడు తుపాకి చేతబట్టి అడవుల్లో తిరిగిన యువతి.. పోలీసుల సాయంతో తర్వాత జనజీవన స్రవంతిలో చేరారు. అనంతరం తన బాటను మార్చుకుని, చదువుపై దృష్టి సారించారు. ఇప్పుడు ఇంటర్ పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించిన ఆమె.. భవిష్యత్తులో పోలీస్ కావడమే తన లక్ష్యమని అంటోంది. ఆమే మహారాష్ట్రలోని గోందియా జిల్లా కుర్‌ఖేడా తహశీల్‌కు చెందిన లావ్‌హరి గ్రామ గిరిజన యువతి రాజుల రావెల్సింగ్‌ హిదామి (19). ఇటీవల వెలువడిన మహారాష్ట్ర 12వ తరగతి బోర్డు పరీక్ష ఫలితాల్లో హిదామీ 45.83 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. దీంతో ఆమెను గోందియా ఎస్పీ నిఖిల్‌ పింగలే శనివారం హిదామీని సత్కరించారు.
తనను నక్సలైట్లు ఎత్తుకెళ్లి, బలవంతంగా ఉద్యమంలో చేర్చుకున్నట్టు హిదామీ వెల్లడించారు. స్థానిక పోలీస్ అధికారి తెలిపిన వివరాల ప్రకారం... దాదాపు ఆరేళ్ల కిందట ప్రాంతంలో తన గ్రామ సమీపంలో పశువులను మేపుతున్న హిదామీని నక్సల్స్‌ అపహరించారు. అనంతరం ఆమెను బలవంతంగా కుర్‌ఖేడా దళంలో చేర్చుకున్నారని చెప్పారు. ఆ తర్వాత సాయుధ శిక్షణ తీసుకున్న రావెల్సింగ్.. పోలీసులపై జరిగిన ఓ హింసాత్మక దాడిలో పాల్గొన్నారు. అయితే, తాను దళం వీడి జనజీవన స్రవంతిలోకి రావాలని భావిస్తున్నట్టు పోలీస్ నిఘా వర్గాలకు సమాచారం అందింది.

దీంతో రెండేళ్ల తర్వాత 2018లో దళం నుంచి బయటకు వచ్చిన హిదామీ.. పోలీసుల సాయంతో అప్పటి గోందియా అదనపు ఎస్పీ సందీప్ అథోల్ ఎదుట లొంగిపోయింది. చిన్న వయసు కావడంతో ఆమె సంరక్షకుడి బాధ్యతలను కూడా పోలీస్ అధికారి తీసుకున్నారు. ఏఎస్పీ, గిరిజన అభివృద్ధి ప్రాజెక్ట్ ఆఫీసర్ జితేంద్ర చుధారీ సూచన మేరకు గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరింది. నక్సల్స్ అపహరించడానికి ముందు ఏడో తరగతి వరకూ చదువుకున్న రాజులు.. తిరిగి తన చదువు కొనసాగించాలని నిర్ణయించుకుంది. కొంత మంది పోలీసులు వేధింపులకు గురిచేసినా వెనక్కి తగ్గలేదు. 2021లో పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి.. ఇంటర్‌లో చేరింది.

ఇప్పడు ఇంటర్‌ పూర్తిచేసిన రాజులు.. డిగ్రీలో చేరుతానని, తర్వాత పోలీస్ అవుతానని అంటోంది. విద్య యొక్క ప్రాధాన్యతను గ్రహించిన ఆమె.. హింసను విడిచిపెట్టి, ప్రధాన స్రవంతిలో చేరడానికి తనలాంటి మరి కొందరికి ప్రేరణగా నిలిచారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.