యాప్నగరం

కేరళ బాధితులకు 'మహా' ఓదార్పు.. తక్షణ సాయంగా రూ.20 కోట్లు!

భారీ వర్షాలు, వరదలతో జల విలయంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న కేరళను ఆదుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రూ.20 కోట్లను తక్షణ సాయం కింద ప్రకటించింది.

Samayam Telugu 18 Aug 2018, 5:55 pm
భారీ వర్షాలు, వరదలతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకోవడానికి మహారాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈ మేరకు రూ.20 కోట్లను తక్షణ సాయం కింద ప్రకటించింది. ఇప్పటికే తెలంగాణ (25 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (10 కోట్లు), బిహార్ (10 కోట్లు), అసోం (5 కోట్లు), పంజాబ్ (10 కోట్లు), హరియాణా (10 కోట్లు), జార్ఖండ్ (5 కోట్లు), గుజరాత్ (10 కోట్లు) రాష్ట్రాలు ఆర్థిక సాయాన్ని ప్రకటించాయి.
Samayam Telugu maha


కేరళలో గత వందేళ్లలో ఎన్నడూలేని విధంగా వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ విపత్తుతో కేరళ పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది. చాలా చోట్ల ప్రజలు వరదల్లో చిక్కుకుపోయి ఆహారం, నీరు లేక సహాయం కోసం దీనంగా ఎదురుచూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.