యాప్నగరం

రూ. లక్షల్లో కరెంట్ బిల్..కూరగాయల వ్యాపారి ఆత్మహత్య

విద్యుత్‌శాఖ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన కంటతడి పెట్టిస్తోంది.

Samayam Telugu 11 May 2018, 1:10 pm
విద్యుత్‌శాఖ సిబ్బంది చేసిన నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ కుటుంబాన్ని రోడ్డున పడేసింది. మహారాష్ట్రలో జరిగిన ఈ విషాద ఘటన కంటతడి పెట్టిస్తోంది. ఔరంగాబాద్‌కు చెందిన జగన్నాథ్ షేల్కే స్థానికంగా కూరగాయలు అమ్ముకుంటూ కుటంబాన్ని పోషిస్తున్నాడు. అయితే మొన్నే విద్యుత్‌శాఖ అధికారులు కరెంట్ బిల్ ఇచ్చారు. అది చూసి అతడికి గుండె ఆగినంత పనయ్యింది. అందులో 55వేల519 యూనిట్ల విద్యుత్ వాడుకున్నందుకు... ఏకంగా రూ.8లక్షల 64వేల 781 ఛార్జ్ చేశారు. అతడు గత 20 ఏళ్లుగా రెండు గదులున్న ఇంట్లో ఉంటున్నాడు. ఎలా చూసినా అంత బిల్లు వచ్చే అవకాశం కూడా లేదు.
Samayam Telugu Suicide...


బిల్లు ఎలా కట్టాలో జగన్నాథ్‌కు అర్థం కాలేదు... అంత ఆర్థిక స్థోమత లేదని కుమిలిపోయిన అతడు తన ఇంట్లోనే ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. ఆత్మహత్య విషయం తెలుసుకున్న పోలీసులు... జగన్నాథ్ ఇంటికి వెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నారు. వెంటనే విద్యుత్ శాఖ అధికారుల్ని సంప్రదించగా...వాస్తవానికి మీటర్ రీడింగ్ 6వేల117.8 కేవీహెచ్ ఉంటే... బిల్లింగ్ క్లర్క్ 61వేల178గా నమోదు చేయడంతో తేడా వచ్చిందని తేలింది. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న అధికారులు ఆ క్లర్క్‌ను సస్పెండ్ చేశారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో కేసు కూడా నమోదు చేశారు. విద్యుత్‌శాఖ సిబ్బంది చేసిన చిన్న తప్పిదంతో నిండు ప్రాణం బలికాగా... ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబం రోడ్డున పడింది.
undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.