యాప్నగరం

Bus falls into river: నర్మదా నదిలో పడిపోయిన బస్సు.. 13 మంది జలసమాధి

మధ్యప్రదేశ్‌లో ఓ బస్సు అదుపు తప్పి నర్మదా నదిలో (Bus falls into river) పడిపోయింది. ఈ ప్రమాదంలో 13 మంది చనిపోయారు. 15 మందిని రక్షించారు. ధార్ జిల్లాలో ఖల్‌ఘాట్ సంజయ్ సేతు వంతెనపై నుంచి బస్సు పడిపోయింది. ఈ సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు మొదలుపెట్టారు.

Authored byAndaluri Veni | Samayam Telugu 18 Jul 2022, 12:21 pm
మధ్యప్రదేశ్‌లో (Bus falls into river) ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడిపోయింది. దాంతో 13 మంది జల సమాధి అయ్యారు. ఇండోర్ నుంచి పూణెకు వెళ్తున్న బస్సు ధార్ జిల్లాలో ఖల్‌ఘాట్ సంజయ్ సేతు వంతెనపై నుంచి పడి నర్మదా నదిలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది ఉన్నారు. దాంతో ప్రయాణికులు నీటిలో గల్లంతయ్యారు. ఈ ప్రమాదంలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu నదిలో పడిన బస్సు


ఈ విషయం తెలుసుకున్న వెంటనే స్థానిక అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే సహాయక చర్యలు మొదలుపెట్టారు. బస్సు నదిలో పడిపోయిందని మధ్యప్రదేశ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా కూడా ధ్రువీకరించారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 15 మందిని రక్షించినట్టు వెల్లడించారు.


ఇదిలా ఉండగా జార్ఖండ్‌లో కూడా ఆదివారం ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. (Jharkhand Boat Accident) పడవ బోల్తా పడి ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. కొడెర్మా జిల్లాలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అయితే సరదాగా టూర్ వేసుకున్న కుటుంబం పడవలో విహరించే సమయంలో ఈ ఘోరం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది చనిపోయారు. మొత్తం పడవలో ఉన్నవాళ్లంతా నీటిలో మునిగిపోగా.. 8 మంది ప్రాణాలు కోల్పోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.