యాప్నగరం

షిర్డీ ప్రయాణం వాయిదా వేసుకోండి.! సాయి భక్తులకు అలెర్ట్

కరోనా కేసులు వేల సంఖ్యలో పెరుగుతుండడంతో మహారాష్ట్ర సర్కార్ కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. షిర్డీ ఆలయం మూసివేయాలని నిర్వాహకులు నిర్ణయించారు.

Samayam Telugu 5 Apr 2021, 9:25 pm
షిర్డీ వెళ్లేందుకు ప్లాన్ చేసుకున్నారా? అయితే ఆ ప్రయాణం ప్రస్తుతానికి వాయిదా వేసుకోవాల్సిందే. మహారాష్ట్రలో కోవిడ్ కేసులు రోజురోజుకీ భారీ సంఖ్యలో పెరుగుతుండడంతో ప్రభుత్వం పాక్షిక లాక్‌డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సాధారణ రోజుల్లో రాత్రి వేళ 8 నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ విధించింది మహా సర్కార్. వారాంతంలో శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి సోమవారం ఉదయం 7 గంటల వరకు లాక్‌డౌన్ విధించింది. అలాగే రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లోకి రానుంది. ఏప్రిల్ 30 వరకూ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
shirdi


ఈ నేపథ్యంలో అత్యంత రద్దీగా ఉండే షిర్డీలోనూ నిషేధాజ్ఞలు అమల్లోకి వచ్చాయి. ఈరోజు (సోమవారం) రాత్రి 8 గంటలకు షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేశారు. కోవిడ్ మహమ్మారి విజృంభిస్తుండడంతో షిర్డీలో బాబా దర్శనాలను నిలుపుదల చేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకూ ఆలయాన్ని మూసివేసేందుకు ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలో నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప రాత్రి 8 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు ఇళ్ల నుంచి బయటికి రాకూడదని మహా సర్కార్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.