యాప్నగరం

మహేశ్ బాబు దీన్ని వెలికి తీశారు.. ఇది కొందరికే తెలుసు: ఆనంద్ మహీంద్రా

మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు.1999లో బిజ్లీ పేరిట మహీంద్రా త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేశామని తెలిపారు.

Samayam Telugu 21 Nov 2019, 7:34 pm
ఆసక్తికర సమాచారంతో నిత్యం వార్తల్లో నిలిచే మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా మరోసారి ఇంట్రెస్టింగ్ ట్వీట్ చేశారు. మహీంద్రా ఎలక్ట్రిక్‌కు సంబంధించి ఆయన సమాచారాన్ని నెటిజన్లతో పంచుకున్నారు. 1999లో బిజ్లీ పేరిట మహీంద్రా త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాన్ని లాంచ్ చేసిన విషయం అతి కొద్ది మందికి మాత్రమే తెలుసన్నా ఆనంద్.. దీనికి ఎస్వీ నగార్కర్ రూపకల్పన చేశారన్నారు.
Samayam Telugu ఆనంద్ మహీంద్రా


బిజ్లీ ఆర్థికంగా వర్కౌట్ కాకపోయినప్పటికీ.. దాని వల్ల మేం చాలా నేర్చుకున్నామని మహీంద్రా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించడానికి తాము కట్టుబడి ఉన్నామన్నారు. ఎలక్ట్రిక్ ఆటో బిజ్లీ ఫొటోను ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. మహీంద్ర ఎలక్ట్రిక్‌ సీఈవో మహేశ్ బాబు ఈ ఫొటోను అర్కైవ్స్ నుంచి వెలికి తీశారన్నారు.
20 ఏళ్ల క్రితం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ తక్కువ, ఖరీదు ఎక్కువ. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ‘బిజిలీ’ సరికొత్తగా మార్కెట్లోకి వస్తే.. జనాదరణ పొందే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.