యాప్నగరం

లగ్జరీ హోటల్లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి

ఓ లగ్జరీ హోటల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడినట్టు...

Ei Samay 30 Mar 2017, 2:27 pm
కోల్‌కతాలోని ఓ లగ్జరీ హోటల్లో చోటుచేసుకున్న అగ్ని ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా ఏడుగురు తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కోల్‌కతాలో హో చి మిన్ శరనికి సమీపంలో వున్న ఓ లగ్జరీ హోటల్లో గురువారం తెల్లవారు జామున 3 గంటలకి ఈ అగ్ని ప్రమాదం సంభవించింది. మొదట హోటల్లోని కిచెన్‌లో అంటుకున్న మంటలు క్షణాల వ్యవధిలోనే హోటల్ మొత్తానికి వ్యాపించాయి.
Samayam Telugu major fire accident at a luxury hotel in kolkata 2 killed
లగ్జరీ హోటల్లో అగ్ని ప్రమాదం.. ఇద్దరు మృతి


తెల్లవారుజామునే జరిగిన అగ్ని ప్రమాదం కావడంతో హోటల్లో బస చేసిన అతిధులు, హోటల్ సిబ్బంది భయాందోళనలకి గురయ్యారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ముగ్గురు వ్యక్తులు హోటల్ 3వ అంతస్తు నుంచి దూకేందుకు ప్రయత్నించినట్టు సమాచారం. ప్రమాదంలో గాయపడినవారిని ఎస్ఎస్‌కేఎం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది 10 ఫైర్ ఇంజిన్లతో ఘటన స్థలానికి చేరుకుని మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. డిజాస్టర్ మేనేజ్‌మెంట్ గ్రూప్ (డీఎంజీ), పోలీస్ పోర్స్ హోటల్ వద్ద సహాయక చర్యల్లో పాల్గొన్నారు. బహుశా షార్ట్ సర్క్యూటే ఈ అగ్ని ప్రమాదానికి కారణమై వుంటుందని ఫైర్ సర్వీసెస్ సిబ్బంది అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రస్తుతానికి హోటల్ వద్ద పరిస్థితి అదుపులో వుందని సంబంధిత అధికారవర్గాలు తెలిపాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.