యాప్నగరం

త్వరలో హిమాలయాల్లో భారీ భూకంపం!

రికర్ట్ స్కేల్‌పై 8 పాయింట్ల తీవ్రతతో హిమాలయాల్లో భారీ భూకంపం సంభవించనుందని భారత భూకంప అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వినీత్ గెహ్లాట్ తెలియజేశారు.

TNN 23 Nov 2017, 11:48 am
రికర్ట్ స్కేల్‌పై 8 పాయింట్ల తీవ్రతతో హిమాలయాల్లో భారీ భూకంపం సంభవించనుందని భారత భూకంప అధ్యయన కేంద్రం డైరెక్టర్ డాక్టర్ వినీత్ గెహ్లాట్ తెలియజేశారు. ఉత్తరాఖండ్‌‌ గర్వాల్‌ ప్రాంతంలోని హిమాలయాల్లో సంభవించే ఈ భారీ భూకంపం వల్ల ఉత్తర భారతదేశంలోని పలు ప్రాంతాలకు తీవ్ర నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. ఉత్తరాఖండ్‌ ప్రాంతంలో ​ గడిచిన ఐదు నుంచి ఏడు శతాబ్దాల్లో భారీ భూకంపం సంభవించినట్లు ఆధారాలు లేవని అన్నారు. అతి త్వరలో సంభవించే ఈ భారీ భూకంపం ఉత్తరాఖండ్‌ను అతలాకుతలం చేయనుందని హెచ్చరికలు జారీ చేశారు.
Samayam Telugu major quake likely to hit north india says chief of seismology centre
త్వరలో హిమాలయాల్లో భారీ భూకంపం!


ఆ ప్రాంతంలో లభించిన గణాంకాల ఆధారంగా చేసి అధ్యయనంలో ఈ విషయం స్పష్టమైందని అన్నారు. అంతేకాదు గత 100 ఏళ్లుగా భారీ భూకంపం సంభవించడానికి అనుకూలమైన పరిస్థితులు అక్కడ నిక్షిప్తమై ఉన్నాయని తెలియజేశారు. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వం నిర్మించే భవనాలు సరైన ప్రణాళికలను అనుసరించాలని సూచించారు. ముందు జాగ్రత్తలు తీసుకుంటే నష్టం తీవ్రత తగ్గించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రుద్ర ప్రయాగ జిల్లాలో సంభవించిన భూకంపం రిక్టర్ స్కేల్‌పై 5.8 గా నమోదైంది. అయితే దీని వల్ల ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. ఉత్తరాది రాష్ట్రాలు భూకంపాలు జోన్‌-1 లో ఉన్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.