యాప్నగరం

ఔషధాలకు లొంగని మలేరియాతో భారత్‌కు ముప్పు!

ఔషధాలకు లొంగని మలేరియా పరాన్నజీవుల సంతతి ఆసియాలో అనేక ప్రాంతాల్లో విస్తరించిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది.

TNN 3 Feb 2017, 11:43 am
ఔషధాలకు లొంగని మలేరియా పరాన్నజీవుల సంతతి ఆసియాలో అనేక ప్రాంతాల్లో విస్తరించిందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. వీటితో ఇండియాకు కూడా ముప్పు పొంచి ఉందని, అక్కడి నుంచి ఆఫ్రికా ఖండానికి విస్తరించే ఆవకాశం ఉన్నట్లు హెచ్చరించింది. తక్షణమే వీటి నివారణకు చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పింది. లేకపోతే ప్రపంచ మానవాళి ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
Samayam Telugu malaria virus growing up in south east asian region
ఔషధాలకు లొంగని మలేరియాతో భారత్‌కు ముప్పు!


మలేరియా పరాన్న జీవి ప్లాస్మోడియం ఫాల్సిపారం‌ను నిర్మూలించడానికి ఆర్టెమిసినిన్, పిపెరాక్విన్ ఔషధాలను వాడతారు. కానీ వీటికి నిరోధకత కలిగిన జీవులు ఉద్భవించి ప్రస్తుతం కంబోడియా, థాయ్‌లాండ్, దక్షిణ లావోస్ ప్రాంతాల్లో వేగంగా విస్తరించినట్లు థాయ్‌లాండ్‌కు చెందిన పరిశోధకుడు ప్రొఫెసర్ అర్జెన్ డాండర్స్ తెలియజేశారు.

అంతే కాకుండా ఇవి భారత్‌లోకి ప్రవేశించి ఆఫ్రికాలోని సబ్ సహారా ఎడారి ప్రాంతానికి విస్తరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే వీటిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఎలాంటి ఔషధాలకు లొంగని స్థాయికి చేరుకుంటాయని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.