యాప్నగరం

భారత్ ఆహ్వానాన్ని తిరస్కరించిన మాల్దీవులు!

అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించే నౌకాదళ విన్యాసాలకు మాల్దీవులను ఆహ్వానించినా, ఆ దేశం తిరస్కరించిందని నేవీ చీఫ్ అడ్మిరల్ సునిల్ లంబ వెల్లడించారు.

TNN 27 Feb 2018, 4:10 pm
అండమాన్ నికోబార్ దీవుల్లో నిర్వహించే నౌకాదళ విన్యాసాలకు మాల్దీవులను ఆహ్వానించినా, ఆ దేశం తిరస్కరించిందని నేవీ చీఫ్ అడ్మిరల్ సునిల్ లంబ వెల్లడించారు. అయితే తాముకు ఎందుకు రాలేకపోతున్నామో కారణాలను కూడా మాల్దీవులు తెలియజేయలేదని పేర్కొన్నారు. ‘మిలన్’ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాల్లో 16 దేశాలకు చెందిన నేవీ విభాగాలు పాల్గొంటాయని నేవీ వర్గాలు తెలిపాయి. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా తన సైనిక ప్రాబల్యాన్ని పెంచుకుంటోన్న నేపథ్యంలో మిలన్ పేరుతో రెండేళ్లకు ఒకసారి నిర్వహించే ఈ నౌకాదళ విన్యాసాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మిలన్ విన్యాసాల్లో భారత్‌తోపాటు 16 దేశాలకు చెందిన నేవీ చీఫ్‌లు కూడా పాల్గొంటారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై వారు చర్చించనున్నారని, ప్రాంతీయ సహకారం, నౌకాయానం, సముద్రంపై చట్టవిరుద్దమైన కార్యకలాపాలను అడ్డుకోవడం లాంటి అంశాలపై తమ అభిప్రాయలను, ఆలోచలను పంచుకుంటారని నేవీ అధికార ప్రతినిధి డీకే శర్మ తెలిపారు.
Samayam Telugu maldives declines indias invite for naval exercise navy chief
భారత్ ఆహ్వానాన్ని తిరస్కరించిన మాల్దీవులు!


నౌకాదళ విన్యాసాలు, వృత్తిపరమైన పరస్పర చర్యల ద్వారా సహకారాన్ని మిలన్ ప్రోత్సహిస్తుందని కెప్టెన్ శర్మ వ్యాఖ్యానించారు. అలాగే భద్రతపరంగా ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొవడానికి, దేశాల మధ్య బలమైన సంబంధాలను పెంపొందించడానికి అవకాశం కల్పిస్తుందని ఆయన అన్నారు. దక్షిణ చైనా సముద్రం విషయంలో చైనా వ్యవహరిస్తోన్న తీరుపై భారత్, అమెరికాతోపాటు అనేక దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. దక్షిణ చైనా సముద్రం ప్రాదేశిక జలాల్లో చైనా సైన్యం పన్నాగాలపై కూడా మిలన్‌లో పాల్గొనే వివిధ దేశాల నేవీ చీఫ్‌లు చర్చించే అవకాశం ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.