గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబ నియంత్రణ గురించి అవగాహన కలిగించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం ఆశా వర్కర్లకు అందజేసిన కిట్లపై తీవ్ర దుమారం రేగుతోంది. ఆ కిట్లలో రబ్బరు పురుషాంగం ఉండటమే దుమారానికి కారణం. అభ్యంతరకర సామాగ్రి కిట్లో ఉంచడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి ఇంటికి వెళ్లి కుటుంబ నియంత్రణ పద్దతులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతోనే మహారాష్ట్ర సర్కారు తొలిసారి ఈ కిట్లను అందజేసింది. సంతానోత్పత్తి జరిగే విధానం గురించి వివరించేలా కిట్లో సామాగ్రిని ఉంచారు. రబ్బరు గర్భాశయం, పురుషాంగం కిట్లో ఉంచడం పట్ల ఆశా కార్యకర్తలు విస్మయం చెందారు. ఇప్పటి వరకూ కుటుంబ నియంత్రణ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కరపత్రాలు, చిత్రాలతో కూడిన బుక్లెట్ను ఉపయోగిస్తున్నారు. కానీ, ప్రస్తుతం మొదటిసారి కిట్లో రబ్బరు పురుషాంగం, గర్భాశయం, కండోమ్లను ఉంచింది.
వీటి సాయంతో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి దీనిపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఉత్తమ గర్భనిరోధక పద్దతుల్లో ఒకటైన కండోమ్ వాడకం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో రబ్బరు పురుషాంగాన్ని ఉంచినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వానిది మంచి ఆలోచనే అయినా.. ఆశా కార్యకర్తలు తమ స్వంత గ్రామాలలో పనిచేస్తారు. కాబట్టి, వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. తరచుగా అవాంఛనీయ అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. ‘‘ఇంతకుముందు కరపత్రాలు, చిత్రాల సాయంతో దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లం.. కానీ ప్రస్తుతం అందజేసిన కిట్లతో అవగాహన కల్పిస్తే కుటుంబసభ్యులు ముఖ్యంగా పురుషులు మమ్మల్ని అసహ్యంగా చూస్తారు’ అని ఓ ఆశా కార్యకర్త వాపోయింది.
తొలి దశలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామీణ జిల్లాల్లో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్లతో తాము కౌన్సిలింగ్ చేయలేమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులకు ఆ బాధ్యతలను అప్పగించాలని ఆశా కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్య శాఖ చొరవను మేము స్వాగతిస్తున్నాము కానీ, చాలా మంది ఆశా కార్యకర్తలు పదో తరగతి లేదా ఆ స్థాయి విద్యార్హతలే ఉన్నవారు కావడంతో లైంగిక విద్యను ఈ సాధనాలతో బోధించడానికి అర్హులుకాదని ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు అన్నారు.
కౌన్సిలింగ్ సందర్భంగా కుటుంబ నియంత్రణ పద్ధతులకు ఇలాంటి కిట్లు ఇవ్వడమేంటని ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే చిత్రా వాగ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వానికి మతిపోయిందని ఆమె విమర్శించారు. ఇది వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ అంశంపై విచారణకు ఆరోగ్య మంత్రి మంత్రి రాజేంద్ర శింగా ఆదేశించారు. నివేదికను త్వరగా అందజేయాలని సూచించారు.
వీటి సాయంతో కుటుంబ నియంత్రణపై అవగాహన కల్పిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్లైన వారికి దీనిపై కౌన్సిలింగ్ ఇస్తారు. ఉత్తమ గర్భనిరోధక పద్దతుల్లో ఒకటైన కండోమ్ వాడకం గురించి తెలియజేయాలనే ఉద్దేశంతో రబ్బరు పురుషాంగాన్ని ఉంచినట్టు తెలుస్తోంది.
ప్రభుత్వానిది మంచి ఆలోచనే అయినా.. ఆశా కార్యకర్తలు తమ స్వంత గ్రామాలలో పనిచేస్తారు. కాబట్టి, వారికి ఇబ్బందికరంగా ఉంటుంది. తరచుగా అవాంఛనీయ అవమానాలను ఎదుర్కోవలసి వస్తుంది. ‘‘ఇంతకుముందు కరపత్రాలు, చిత్రాల సాయంతో దంపతులకు కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్లం.. కానీ ప్రస్తుతం అందజేసిన కిట్లతో అవగాహన కల్పిస్తే కుటుంబసభ్యులు ముఖ్యంగా పురుషులు మమ్మల్ని అసహ్యంగా చూస్తారు’ అని ఓ ఆశా కార్యకర్త వాపోయింది.
తొలి దశలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న గ్రామీణ జిల్లాల్లో ఈ కిట్లను పంపిణీ చేస్తున్నారు. ఈ కిట్లతో తాము కౌన్సిలింగ్ చేయలేమని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులకు ఆ బాధ్యతలను అప్పగించాలని ఆశా కార్యకర్తలు ప్రభుత్వాన్ని కోరారు. ఆరోగ్య శాఖ చొరవను మేము స్వాగతిస్తున్నాము కానీ, చాలా మంది ఆశా కార్యకర్తలు పదో తరగతి లేదా ఆ స్థాయి విద్యార్హతలే ఉన్నవారు కావడంతో లైంగిక విద్యను ఈ సాధనాలతో బోధించడానికి అర్హులుకాదని ఆశా కార్యకర్తల సంఘం అధ్యక్షురాలు అన్నారు.
కౌన్సిలింగ్ సందర్భంగా కుటుంబ నియంత్రణ పద్ధతులకు ఇలాంటి కిట్లు ఇవ్వడమేంటని ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే చిత్రా వాగ్ తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వానికి మతిపోయిందని ఆమె విమర్శించారు. ఇది వివాదాస్పదం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఈ అంశంపై విచారణకు ఆరోగ్య మంత్రి మంత్రి రాజేంద్ర శింగా ఆదేశించారు. నివేదికను త్వరగా అందజేయాలని సూచించారు.