యాప్నగరం

నోట్ల రద్దు: మోదీ పై నిప్పులు చెరిగిన దీదీ

దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారంటూ ప్రధాని మోడీపై మమతా బెనర్జీ నిప్పులు కురిపించారు.

TNN 27 Dec 2016, 6:45 pm
నోట్ల రద్దు నిర్ణయంతో దేశాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టారంటూ ప్రధాని మోడీపై మమతా బెనర్జీ నిప్పులు కురిపించారు. నోట్ల రద్దుపై మంగళవారం ప్రతిపక్షాలన్నీ సంయుక్తంగా ఢిల్లీలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మమతా బెనర్జీ, రాహుల్ గాంధీ ప్రధానిపై తీవ్ర విమర్శలు చేశారు. నవంబర్ 8న తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం ఓ పెద్ద స్కామ్ అని దీదీ అన్నారు. యాభై రోజుల్లో పరిస్థితి సర్దుకుంటుందని ప్రధాని చెప్పారని నోట్ల రద్దు నిర్ణయానికి నేటితో 49 రోజులు నిండుతున్నాయన్నారు. ఆయన చెప్పినట్టు 50వ రోజు పరిస్థితులు సాధారణ స్థితికి మారకపోతే ప్రధాని పదవికి మోడీ రాజీనామా చేస్తారా? అని దీదీ ప్రశ్నించారు. మోడీ దేశాన్ని 20 వెనక్కి తోశారని యద్దేవా చేశారు.
Samayam Telugu mamata banerjee rahul gandhi dare pm modi to resign for failure of note ban
నోట్ల రద్దు: మోదీ పై నిప్పులు చెరిగిన దీదీ


ప్రతిపక్షాలన్నీ కలిపి నోట్ల రద్దు అంశంపై ‘కామన్ మినిమమ్ ఎజెండా’ ను రూపొందించాలని కాంగ్రెస్ భావించింది. అయితే ఈ మీటింగ్ కు కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, జేడీయూ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. కమ్యూనిస్టు పార్టీలతో పాటూ అనేక పార్టీలు హాజరుకాలేదు. అయినా కూడా తాము భవిష్యత్తులో ఎజెండాను రూపొందిస్తామని మమతా తెలిపారు.

రాహుల్ గాంధీ మాట్లాడుతూ సహారా ముడుపుల వ్యవహారంపై ప్రధాని మోడీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. ఆ ముడుపుల వ్యవహారంలో కాంగ్రెస్ నాయకురాలు షీలా దీక్షిత్ పేరు కూడా ఉంది. అయితే రాహుల్ మాట్లాడుతూ షీలా దీక్షిత్ విచారణకు సిద్ధంగా ఉన్నారని, మోడీ సిద్ధమేనా అని ప్రశ్నించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.