యాప్నగరం

Mamata Banerjeeకు బాబు సంఘీభావం.. నేడు కోల్‌కతాకు

మోదీ వర్సెస్ దీదీగా మారిన రాజకీయ పరిణామాలకు కారణమైన శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆశ్రయించింది.

Samayam Telugu 5 Feb 2019, 10:48 am
మోదీ సర్కారుపై తిరుగుబావుటా ఎగురువేసి పశ్చిమ్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి విపక్షాల నుంచి మద్దతు లభిస్తోంది. దీన్ని సమాఖ్య వ్యవస్థపై కేంద్రం దాడికి వారు అభివర్ణించారు. కోల్‌కతా పరిణామాలను తీవ్రంగా పరిగణించిన వివిధ పార్టీలు నేతలు మమతకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మమతకు మద్దతు ప్రకటించారు. సోమవారం మధ్యాహ్నం కోల్‌కతా వెళ్లి సీఎం మమతా బెనర్జీని ఆయన కలవనున్నారు. కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆమె చేపట్టిన ‘సత్యాగ్రహ’ దీక్షకు సంఘీభావం తెలియజేనున్నారు. మరోవైపు, మోదీ వర్సెస్ దీదీగా మారిన రాజకీయ పరిణామాలకు కారణమైన శారదా, రోజ్‌వ్యాలీ కుంభకోణాలపై దర్యాప్తు కొనసాగించేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ సుప్రీంకోర్టు సీబీఐని ఆశ్రయించింది.
Samayam Telugu babu


సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం విచారించి, నిర్ణయాన్ని ప్రకటించనుంది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి సుప్రీంకోర్టుపై పడింది. రోజ్‌వ్యాలీ, శారదా చిట్స్ కుంభకోణం కేసులో సాక్ష్యాధారాలను ధ్వంసం చేయడానికి పశ్చిమ్ బెంగాల్ పోలీసులు, అధికారులు ప్రయత్నించినట్టు, వ్యూహరచన చేసినట్టు రుజువులుంటే తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. విచారణ ప్రారంభమయ్యే లోపు వాటిని సమర్పించాలని స్పష్టం చేసింది. సాక్ష్యాలను నాశనం చేయడానికి కోల్‌కతా పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఏ మాత్రం ప్రయత్నించినా ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని సుప్రీం హెచ్చరించింది.

సీబీఐకి అనుకూలంగా తీర్పు వస్తే కోల్‌కతా పోలీస్ కమిషనర్‌ రాజీవ్ కుమార్‌ను ప్రశ్నిస్తుంది. వ్యతిరేకంగా వస్తే మమత గెలిచినట్టు అవుతుంది. మరోవైపు, బెంగాల్ వ్యాప్తంగా టీఎంసీ కార్యకర్తలు చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. మోదీ, అమిత్ షా దిష్టి బొమ్మల్ని దహనం చేస్తున్నారు. కాగా, శుక్రవారం వరకు తన ధర్నా కొనసాగుతుందని మమత ప్రకటించారు. బోర్డు పరీక్షలు నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా తన దీక్షను విరమించనున్నట్టు ఆమె తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.