దేశవ్యాప్తంగా సంచలనం రేపిన పెగాసస్ వివాదం తర్వాత పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ దూకుడును పెంచారు. ఐదు రోజుల ఢిల్లీ పర్యటనను విజయంతంగా ముగించుకున్న మమత సంచలన ప్రకటన చేశారు. ఇకపై తాను ప్రతి రెండు నెలలకోసారి ఢిల్లీకి వస్తానని వెల్లడించిన మమతా బెనర్జీ... బీజేపీని అధికారం నుంచి కూలదోసేంత వరకు ''ఖేలా హాబ్' కొనసాగుతుందని ప్రకటించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడమే తన తక్షణ కర్తవ్యమని పేర్కొన్నారు. ప్రతిపక్ష నేతలతో భేటి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తన ఢిల్లీ పర్యటన విజయవంతమైందని ప్రకటించారు. ఈ సందర్భంగా 'సేవ్ డెమోక్రసీ, సేవ్ కంట్రీ' తన నినాదమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా దేశీయంగా పెరిగిపోతున్న ద్రవ్యోల్బణం, పెట్రోల్, గ్యాస్ ధరలపై ఆమె మండిపడ్డారు. ప్రతి ఒక్కరి నినాదం దేశాన్ని రక్షించడమే అని పేర్కొన్నారు. దేశ రాజకీయ పరిస్థితులపై శరద్ పవార్, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చించామని వెల్లడించారు. ప్రతిపక్ష ఐక్యత సమస్యపై కూడా చర్చించామని చెప్పారు. కాగా తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మమతా బెనర్జీ శరద్ పవార్, కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఆప్ నేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, తదితర ప్రతిపక్ష నాయకులతో సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే మోదీ-షాలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే హస్తిన పర్యటనకు వచ్చిన మమతా తాజా ప్రకటనతో మరింత రాజకీయ వేడి పెంచారు. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ కావడం ఈ అంచనాలకు మరింత బలాన్నిస్తోంది. మొత్తానికి 2024లో మోదీ-షా ద్వయానికి బెంగాల్ లాంటి షాకివ్వాలని మమత గట్టిగా ఫిక్స్ అయినట్లు అనిపిస్తోంది.
ఈ నేపథ్యంలోనే మోదీ-షాలకు చెక్ పెట్టే వ్యూహంలో భాగంగానే హస్తిన పర్యటనకు వచ్చిన మమతా తాజా ప్రకటనతో మరింత రాజకీయ వేడి పెంచారు. మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్... శరద్ పవార్, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో భేటీ కావడం ఈ అంచనాలకు మరింత బలాన్నిస్తోంది. మొత్తానికి 2024లో మోదీ-షా ద్వయానికి బెంగాల్ లాంటి షాకివ్వాలని మమత గట్టిగా ఫిక్స్ అయినట్లు అనిపిస్తోంది.