యాప్నగరం

ప్రజాస్వామ్య విజయం.. ‘సెమీస్‌’ ఫలితాలపై మమత ట్వీట్లు

సెమీఫైనల్‌గా అభివర్ణిస్తోన్న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు.

Samayam Telugu 11 Dec 2018, 12:40 pm
లోక్‌సభ ఎన్నికల ముందు సెమీఫైనల్‌గా అభివర్ణించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల సరళిపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ ఎదురీదుతున్న వేళ.. ఆమె కాషాయ పార్టీకి చురకలు అంటించారు. జనం బీజేపీని ఓడించారు. ఇది ప్రజాతీర్పు, దేశ ప్రజల విజయం అని మమత ట్వీట్ చేశారు.
Samayam Telugu mamata-banerjee1


ఇది ప్రజాస్వామ్య విజయం. అన్యాయం, అరాచకం, వ్యవస్థలను నాశనం చేయడం, సీబీఐ లాంటి ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం; పేదలు, రైతులు, యువత, దళితులు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలు, మైనార్టీల కోసం పని చేయకపోవడానికి వ్యతిరేకంగా లభించిన గెలుపని దీదీ ట్వీట్ చేశారు.
తెలుగు
సెమీఫైనల్లో ఎక్కడా పోటీలో లేనని బీజేపీ నిరూపించింది. 2019 ఫైనల్ మ్యాచ్‌కు ముందు ఇది నిజమైన ప్రజాస్వామ్య సూచిక. ప్రజాస్వామ్యంలో అంతిమంగా ప్రజలదే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. గెలిచిన వారికి అభినందలంటూ మమతా వరుస ట్వీట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.