యాప్నగరం

దటీజ్ మమత.. ఒక్క ఓటూ పడకుండానే 20 వేల సీట్లు

ఎలక్షన్ షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచే పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి.

Samayam Telugu 30 Apr 2018, 7:07 pm
పశ్చిమ బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో సీఎం మమతా బెనర్జీ అదరగొట్టారు. ఒక్క ఓటు కూడా పోలవకుండానే 34 శాతం స్థానాలను కైవసం చేసుకొని దీదీ పవరేంటో మరోసారి నిరూపించారు. పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ జరగకముందే మూడో వంతుకు పైగా స్థానాలు అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ ఖాతాలోకి వెళ్లిపోవడం విశేషం. ప్రత్యర్థి లేకపోవడంతో ఆ స్థానాల్లో సీఎం మమతా బెనర్జీ పార్టీ ఏకగ్రీవం అయ్యింది. ఇంత భారీ సంఖ్యలో పంచాయతీ సీట్లు ఏకగ్రీవం కావడం బెంగాల్‌ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం విశేషం.
Samayam Telugu mamata


పశ్చిమ బెంగాల్‌లో మే 14న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 58,692 పంచాయతీ సీట్లు ఉండగా.. వీటిలో 20 వేలకు పైగా స్థానాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి మినహా ఎవరూ పోటీలో లేరు. దీంతో ఆ స్థానాలన్నీ ఏకగ్రీవమయ్యాయి. కొందరు తమ నామినేషన్లను వెనక్కి తీసుకోవడం, మరికొందరి నామినేషన్లు సరిగ్గా లేకపోవడంతో తిరస్కరణకు గురవడం.. ఇలాంటి కారణాల వల్ల ఈ స్థానాల్లో ఎలాంటి పోటీ జరగట్లేదని ఎన్నికల అధికారులు తెలిపారు.

ఎలక్షన్ షెడ్యూల్‌ ప్రకటించిన నాటి నుంచే పశ్చిమ బెంగాల్ స్థానిక సంస్థల ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య వాగ్వాదాలు జరుగుతూ వార్తల్లో ప్రముఖంగా నిలిచాయి. ఈ వ్యవహారంలో ప్రతిపక్ష పార్టీ కోర్టుకు కూడా వెళ్లింది. తమను నామినేషన్‌ వేయనీయకుండా అధికార పార్టీ అడ్డుకుంటోందని ఆరోపించింది. దీంతో ఎన్నికల కమిషన్‌ 9 మంది అభ్యర్థుల దరఖాస్తులను వాట్సాప్‌ ద్వారా స్వీకరించడం గమనార్హం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.