యాప్నగరం

ఆవుపై అత్యాచారం.. సీసీ కెమెరాల్లో ఆ ఘోరం, నిందితుడి అరెస్టు

Bhopal: 55 ఏళ్ల ఓ వ్యక్తి ఓ పశువుల పాకలో దూరి ఆవుతో జుగుప్సాకరంగా ప్రవర్తించాడు. అసహజ లైంగిక చర్యకు సంబంధించిన దృశ్యాలు డెయిరీ ఫాంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

Samayam Telugu 12 Jul 2020, 7:40 pm
కామవాంఛతో రగిలిపోయిన ఓ వ్యక్తి ఆవుపై అత్యాచారం చేశాడు. అది కూడా 55 ఏళ్ల వయసులో.. మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌న‌ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. అత‌డిపై సెక్షన్ 377 కింద కేసు న‌మోదు చేసినట్లు తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
Samayam Telugu నమూనా చిత్రం
Bhopal man sex with cow


జులై 4న మ‌ధ్యప్రదేశ్‌లోని సుంద‌ర్‌ న‌గ‌ర్ ప్రాంతంలో షబ్బీర్ అలీ (55) అనే వ్యక్తి ఓ ప‌శువుల పాకలోకి అక్రమంగా ప్రవేశించాడు. అనంతరం ఓ ఆవుతో అసహజ లైంగిక చర్యకు పాల్పడ్డాడు. వేకువజామున 4 గంట‌ల‌ ప్రాంతంలో ఈ దారుణానికి ఒడిగట్టడం గమనార్హం. నిందితుడు ఆవుతో అసహజంగా ప్రవర్తిస్తుండగా.. గోమాత రోదనలు చేసింది. ఆ అరుపులకు మేల్కొన్న య‌జ‌మాని అక్కడికి వచ్చే సరికే నిందితుడు ప‌రారయ్యాడు.

నిందుతుడు ఒడిగట్టిన దారుణానికి సంబంధించిన దృశ్యాలు డెయిరీ ఫాంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఆ ఫుటేజీలను ప‌రిశీలించి యజమాని షాక్‌కు గురయ్యారు. ఘటనపై స్థానిక అశోక్ గార్డెన్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యజమాని ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసినట్లు అశోక గార్డెన్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ శ్రీవాస్తవ తెలిపారు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు.

Also Read: బస్సులో ‘ఆ’ సీన్ చేస్తూ మాస్క్ తీసిన పోర్న్ స్టార్.. అధికారులు గుర్రు

Don't Miss: రక్తదానం దానం చేసిన శునకం

Also Read: మహిళను నడిరోడ్డుపై నరికి, నరికి.. వనపర్తిలో ఘోరం, వీడియో వైరల్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.