యాప్నగరం

కళేబరం ఉందని కొట్టి, ఇల్లు తగులబెట్టారు!

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. చనపోయిన ఆవు కళేబరం ఇంటి బయట ఉందన్న కారణంగా ఓ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టి

Samayam Telugu 28 Jun 2017, 2:07 pm
రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. చనపోయిన ఆవు కళేబరం ఇంటి బయట ఉందన్న కారణంగా ఓ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టి..ఆ వ్యక్తిని చితకబాదారు. ఈ సంఘటన గిరిధిహ్ జిల్లా డియోరిలోని బెరియ హథియతాండ్ మంగళవారం జరిగింది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దుండగులను చెదరగొట్టారు. దాడిలో గాయపడ్డ ఉస్మాన్ అన్సారీని ఆసుపత్రికి తరలించారు.
Samayam Telugu man attacked by mob house set on fire in rajasthan
కళేబరం ఉందని కొట్టి, ఇల్లు తగులబెట్టారు!


పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. అన్సారీ ఇంటి సమీపంలో చనిపోయిన కళేబరం పడి ఉంది. అయితే ఈ ఆవును అన్సారే మాంసం కోసం చంపాడని మంది గ్రామస్థులు ఆయనపై దాడి చేయడంతో పాటు ఆయన ఇంటికి నిప్పు పెట్టారు. దాదాపు 200 మంది దాకా ఈ ఘటనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. సకాలంలో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గుంపును చెదరగొట్టారు. అన్సారీ ఇంటిపై దాడి చేసిన వారు పోలీసులపై కూడా రాళ్లు రువ్వడంతో.. పోలీసులు లాఠీ చార్జీ చేసి గుంపును చెదరగొట్టారు. పలువురిని అరెస్టు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.