యాప్నగరం

ఢిల్లీలో బాంబుల కలకలం.. నగరమంతా హై అలర్ట్

ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో నగరాన్ని బలగాలు జల్లెడపడుతున్నాయి. డాగ్, బాంబ్, బైక్ స్క్వాడ్‌లు అణువణువూ గాలిస్తుండగా.. ఈ క్రమంలోనే బైక్ స్క్వాడ్ ఓ వ్యక్తిని పట్టుకుంది.

Samayam Telugu 7 Aug 2018, 1:28 pm
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ దేశరాజధాని ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇంటిలిజెన్స్ హెచ్చరికలతో నగరాన్ని బలగాలు జల్లెడపడుతున్నాయి. డాగ్, బాంబ్, బైక్ స్క్వాడ్‌లు అణువణువూ గాలిస్తుండగా.. ఈ క్రమంలోనే బైక్ స్క్వాడ్ ఓ వ్యక్తిని పట్టుకుంది. ఢిల్లీ నుంచి జమ్మూకు వెళ్లే బస్సులో తనిఖీలు జరపుతుండగా ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. అతడి దగ్గర సోదాలు చేయగా.. బాంబులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని.. అతడ్ని అరెస్ట్ చేశారు.
Samayam Telugu Delhi


బాంబుల దొరకడంతో నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టుల్ని ఏర్పాటు చేసి క్షుణ్ణంగా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నగరంలోకి వచ్చే వాహనాలతో పాటూ.. బయటకు వెళ్లేవాటిలో సోదాలు జరపుతున్నారు. అనుమానాస్పదంగా తిరుగుతున్న వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా జనాల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలపై నిఘా పెంచారు. డాగ్, బాంబ్, బైక్ స్క్వాడ్‌లతో పాటూ ఎన్ఐఏ టీమ్‌లు కూడా రంగంలోకి దిగాయి.
Read This Story In English

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.