యాప్నగరం

Mumbai ముకేశ్ అంబానీకి బెదిరింపు కాల్స్.. పోలీసుల అదుపులో నిందితుడు

సోమవారం ఉదయం రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఫోన్ చేసిన ఓ వ్యక్తి.. ఛైర్మన్ ముకేశ్ అంబానీని చంపుతానంటూ బెదిరించడంతో పోలీసులు కేసు నమోదుచేశారు. రెండేళ్ల కిందట అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం రేగిన విషయం తెలిసిందే. ముకేశ్ కుటుంబానికి కేంద్రం భద్రత కల్పించడాన్ని సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. ఈ నేపథ్యంలో ఆగంతకుడు ఫోన్ చేయడంతో అప్రమత్తమయ్యారు. కాల్ డేటా ఆధారంగా ట్రేస్ చేసి అదుపులోకి తీసుకున్నారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 15 Aug 2022, 3:37 pm

ప్రధానాంశాలు:

  • ముకేశ్ అంటాలీయ నివాసానికి భారీ భద్రత.
  • కేంద్రం చర్యలను సమర్దించిన సుప్రీంకోర్టు.
  • రిలయన్స్ ఫాండేషన్ హాస్పిటల్‌కు ఫోన్.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ముకేశ్ అంబానీ
రిలయన్స్ సంస్థ (Reliance Industries) అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani), ఆయన కుటుంబాన్ని చంపుతానంటూ బెదిరింపులకు పాల్పడిన ఆగంతుకుడ్ని ముంబయి పోలీసులు (Mumbai Police) సోమవారం అదుపులోకి తీసుకున్నారు. ముంబయిలోని గిర్‌గావ్‌లో ఉన్న రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ (Reliance Foundation Hospital) ల్యాండ్‌లైన్ నెంబర్‌కు ఈ ఉద్యం మూడు నాలుగుసార్లు గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ చేశాడని అధికారులు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదుచేయడంతో ఫోన్ నెంబర్ ఆధారంగా అనుమానితుడ్ని అఫ్జల్ అనే వ్యక్తిగా గుర్తించామని చెప్పారు. మొబైల్ నెంబర్‌ను సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి, అతడు ఎక్కడున్నదీ తెలుసుకుని అరెస్ట్ చేసినట్టు వివరించారు. అయితే, పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడు మతిస్థిమితం లేని వ్యక్తిగా భావిస్తున్నారు. కేసు నమోదుచేసిన పోలీసులు.. అతడ్ని విచారిస్తున్నారు.
ఇదిలా ఉండగా, ముకేశ్ అంబానీ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం భద్రతను నిరంతరం కొనసాగించడాన్ని సవాల్ చేస్తూ ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు (Supreme Court) గత నెలలో తిరస్కరించింది. అంబానీలకు భద్రత కల్పించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం విచారణకు త్రిపుర హైకోర్టు (Tripura High Court) అనుమతించగా.. దీనిపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. కేంద్రం సూచనలతో ముకేశ్ అంబానీ, వారి కుటుంబ సభ్యులకు మహారాష్ట్ర ప్రభుత్వం భద్రత కల్పించింది.

గతేడాది ముకేశ్ అంబానీ అంటీలియా నివాసం సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన వాహనం కలకలం రేపడంతో విచారణలో మాజీ పోలీస్ అధికారి కుట్ర ఉన్నట్టు తేలింది. ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీల పేర్లను ప్రస్తావించి చంపుతామని బెదిరిస్తూ చేతిరాతతో ఉన్న ఓ లేఖ కూడా కారులో ఉంచారు. ఇది చివరకు మహారాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. దీనిపై పోలీసులు విచారణలో ఊహించని పరిణామాలు, మలుపులు చోటుచేసుకున్నాయి.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.