యాప్నగరం

కన్నతల్లి శవాన్ని బైక్‌పై కట్టుకుని.. 80 కిలోమీటర్ల ప్రయాణం.. వీడియో వైరల్..!

కన్నతల్లి కళ్ల ఎదుటే మరణిస్తే అది ఎంత బాధాకరం చెప్పనక్కర్లేదు. అలాంటిది కళ్లెదుటే చనిపోయిన కన్నతల్లి శవాన్ని ఇంటిదాకా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక.. ఓ యువకుడు పడిన అవస్థ, ఆవేదనతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అమానవీయ ఘటన నెటిజన్ల మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర చోటుచేసుకుంది.

Edited byరావు | Samayam Telugu 2 Aug 2022, 8:10 am

ప్రధానాంశాలు:

  • అంబులెన్స్‌కి డబ్బులు లేక బైక్‌పై తల్లి మృతదేహం
  • దాదాపు 80 కిలోమీటర్లు ప్రయాణం చేసిన కొడుకు
  • మధ్యప్రదేశ్‌లో షాడోల్ జిల్లాలో చోటుచేసుకున్న ఘటన
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Helpless Son Ties Mothers Body To Bike
తల్లి మృతదేహాన్ని బైక్‌పై తీసుకెళ్తున్న యువకుడు
కన్నతల్లి కళ్ల ఎదుటే మరణిస్తే అది ఎంత బాధాకరం చెప్పనక్కర్లేదు. అలాంటిది కళ్లెదుటే చనిపోయిన కన్నతల్లి శవాన్ని ఇంటిదాకా తీసుకెళ్లేందుకు అంబులెన్స్ లేక.. ఓ యువకుడు పడిన అవస్థ, ఆవేదనతో కూడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తల్లి మృతదేహంతో 80 కిలోమీటర్లు ప్రయాణించిన ఈ అమానవీయ ఘటన నెటిజన్ల మనస్సును కదిలించింది. ఈ దారుణ ఘటన మధ్యప్రదేశ్‌లోని షాడోల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర చోటుచేసుకుంది.

మధ్యప్రదేశ్ - ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న అనుప్పూర్ జిల్లాకు చెందిన జైమంత్రి యాదవ్ కొద్ది రోజుల కిందట ఛాతినొప్పి రావడంతో అనప్పూర్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆమె పరిస్థితి రోజురోజుకూ క్షీణించడంతో అనప్పూర్ జిల్లా ఆస్పత్రి అధికారులు.. షాడోల్ జిల్లాలోని మెడికల్ కాలేజీ కమ్ డిస్ట్రిక్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న జైమంత్రి సోమవారం కన్నుమూసింది.

అయితే, తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్, మార్చురీ వాహనం కోసం ఆస్పత్రి వర్గాలను అడిగితే అందుబాటులో లేవని చెప్పారని కొడుకు సుందర్ యాదవ్ చెప్పాడు. దాంతో ప్రైవేట్ వాహనం కోసం ప్రయత్నిస్తే వాళ్లు రూ.5 వేలు అడగడంతో.. అంత డబ్బులు లేక ఇలా బైక్‌పై కట్టుకుని వెళ్లాల్సి వచ్చిందని సుందర్ కన్నీటి పర్యంతమయ్యాడు.
మధ్యప్రదేశ్‌లో అంబులెన్స్‌లు అందుబాటులో లేక ఇలా మృతదేహాలను తీసుకెళ్లడం ఇదే మొదటిసారేమీ కాదు. జులై 11న గుణ జిల్లాలో ప్రభుత్వ అంబులెన్స్‌లు దొరక్క ఒక ఎనిమిదేళ్ల బాలుడు తన తమ్ముడి శవంతో రోడ్డుపైనే కూర్చొన్న వీడియో ఒకటి వైరల్ అయింది. ఆ సమయంలో స్పందించిన పోలీసులు మృతదేహాన్ని వారి స్వగ్రామానికి తరలించే ప్రయత్నం చేశారు.
రచయిత గురించి
రావు
గోనె.మహేష్ సమయం తెలుగులో కన్సల్టెంట్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ వెబ్‌స్టోరీ విభాగానికి సంబంధించి స్పోర్ట్స్, ఎంటర్‌టైన్‌మెంట్ సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.