కదిలేందుకు సిద్ధంగా ఉన్న రైలు ముందుకు దూకి ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అయితే పైలట్ సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం మెట్రో స్టేషన్ వద్ద శనివారం చోటుచేసుకుంది. అయితే అతడి రక్షించి హాస్పిటల్కు తరలించారు. శనివారం ఉదయం సరిగ్గా 8.44 గంటలకు జేఎల్ఎన్ మెట్రో స్టేడియం నుంచి బదారాపూర్ వెళ్లే రైలు కదులుతుండగా ఓ వ్యక్తి దాని ముందు దూకినట్టు డీఎంఆర్సీకి చెందిన ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. బాధితుడిని టెక్ చంద్ (57)గా గుర్తించారు. సకాలంలో డ్రైవర్ స్పందించడంతో అతడు ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. గాయపడిని బాధితుడిని హాస్పిటల్లో చేర్పించామని, ప్రమాదం లేదని ఆ అధికారి వెల్లడించారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నించాడో కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని తెలుస్తాయని అన్నారు. అతడిపై కూడా పోలీసులు అత్మహత్యాయత్నం కేసు నమోదుచేశారు. కోలుకున్న అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి అవసరమైతే మానసిక చికిత్స కూడా నిర్వహిస్తామని అధికారి వివరించారు.
దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అతడు ఆత్మహత్యాయత్నానికి ఎందుకు ప్రయత్నించాడో కారణాలు తెలియరాలేదని పేర్కొన్నారు. దర్యాప్తులో అన్ని తెలుస్తాయని అన్నారు. అతడిపై కూడా పోలీసులు అత్మహత్యాయత్నం కేసు నమోదుచేశారు. కోలుకున్న అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి అవసరమైతే మానసిక చికిత్స కూడా నిర్వహిస్తామని అధికారి వివరించారు.