యాప్నగరం

నేను ఎలాగూ చస్తున్నా.. నిన్నూ చంపేస్తా

వీడు నిజంగానే శాడిస్ట్... తాను ఎలాగూ చస్తున్నానని... ట్రైన్‌లో నుంచి తోసేసి మరొకర్ని బలి తీసుకున్నాడు. తీరా వాడు మాత్రం చావలేదు.

TNN 19 Feb 2018, 5:53 pm
ఎవరన్నా ప్రమాదంలో ఉంటే... ఏం చేస్తాం. అయ్యో పాపం అనుకొని కాపాడుతాం. కాని ఓ వ్యక్తి మాత్రం సృష్టికి విరుద్దం. తాను ఎలాగూ చావాలనుకున్నాడు... చస్తూ చస్తూ ఊరికే ఎందుకు అనుకున్నాడో ఏమో... మరో వ్యక్తిని చంపేశాడు. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. కామాయని ఎక్స్‌ప్రెస్ సుఖి సెవానియా స్టేషన్‌కు సమీపానికి వచ్చింది. అప్పుడే రజ్మల్ పాల్ అకా రజ్జు అనే వ్యక్తి టాయిలెట్ దగ్గరకు వచ్చాడు. అప్పుడే రితేష్ అనే వ్యక్తి లోపలి నుంచి బయటకు వచ్చాడు. అతడ్ని చూసిన రజ్జు రెచ్చిపోయాడు. నేను ఎలాగూ చస్తున్నా... నిన్నూ చంపేస్తానంటూ చొక్కా పట్టుకొని ట్రైన్ డోర్‌లో నుంచి అతడ్ని తోసేశాడు.
Samayam Telugu man kicked out of train by co passenger for no reason in madhya pradesh
నేను ఎలాగూ చస్తున్నా.. నిన్నూ చంపేస్తా



ఈ హఠాత్ పరిణామంతో అక్కడున్న వాళ్లంతా షాకయ్యారు. ఏం జరుగుతుందో చూసే లోపలే... రితేష్ కిందకు పడిపోయాడు. అక్కడే ఉన్న రైల్వే పోలీసులు నిందితుడు రజ్జును అదుపులోకి తీసుకున్నారు. చనిపోయిన వ్యక్తికి ఇతడికి ఎలాంటి పరిచయం లేదు. అలాగనీ ట్రైన్‌లోనూ ఎలాంటి గొడవ జరగలేదని తోటి ప్రయాణికులు చెబుతున్నారు. ఘటన సమయంలో రజ్జు సోదరుడు కూడా పక్కనే ఉన్నాడు. నిందితుడ్ని ప్రశ్నిస్తున్న పోలీసులు... అతడి మానసిక పరిస్థితి సరిగా లేదా... ఉద్దేశపూర్వకంగా చేశాడా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.