యాప్నగరం

కూతురితో కలిసి భర్తని హత్య చేయించిన భార్య

కూతురితో కలిసి భర్తనే హత్య చేయించింది ఓ భార్య. భర్త శశిభూషణ్(47) ఓ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్.

Bangalore Mirror Bureau 3 Apr 2017, 4:36 pm
కూతురితో కలిసి భర్తనే హత్య చేయించింది ఓ భార్య. భర్త శశిభూషణ్(47) ఓ గవర్నమెంట్ స్కూల్ హెడ్ మాస్టర్. భార్య శాంతమ్మ(46) కూడా గవర్నమెంట్ స్కూల్ టీచర్‌గానే పనిచేస్తోంది. కర్ణాటకలోని మాండ్యకి చెందిన ఈ ఇద్దరు దంపతుల మధ్య ఆస్తి తగదాలు, భర్త కూడా తనని సరిగ్గా చూసుకోకపోవడం వంటివి ఆమెకి అతడిపై ద్వేషం మరింత పెరిగేలా చేశాయి. ఇంకేం.. 20 ఏళ్ల కూతురు నవ్యశ్రీతో కలిసి స్కెచ్ వేసింది. తన పరిస్థితులు అన్నీ తెలిసిన పొరుగింటి ఆటో డ్రైవర్ సురేష్ సహాయంతో మైసూరుకి చెందిన ఓ నలుగురు సభ్యుల ముఠాకి రూ. 5లక్షల సుపారీ కూడా ఇచ్చింది.
Samayam Telugu man killed by his wife and daughter
కూతురితో కలిసి భర్తని హత్య చేయించిన భార్య


శాంతమ్మ ఇచ్చిన ఫోటోలు, రూట్ మ్యాప్ డీటేల్స్ ఆధారంగా రెక్కీ నిర్వహించిన మైసూర్ సుపారీ బ్యాచ్... మార్చి 31వ తేదీన శశిభూషణ్ స్కూల్‌కి వెళ్తుండగా దారిమధ్యలోనే అడ్డగించి అతడి గొంతు కోసి పరారైంది. మాండ్యలో చోటుచేసుకున్న ఈ ఘటనలో అసలు నిందితులు భార్య శాంతమ్మ, కూతురు నవ్యశ్రీనే అని గ్రహించిన పోలీసులు నిన్న ఆదివారం ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసి జుడీషియల్ కస్టడీకి తరలించారు. శాంతమ్మ ఇచ్చిన ఆదేశాల ప్రకారం శశిభూషణ్‌ని హత్య చేసిన మైసూరు సుపారీ బ్యాచ్ వివరాలు సేకరిస్తున్న పోలీసులు... త్వరలోనే వారిని పట్టుకుంటామని చెబుతున్నారు.

శశిభూషణ్-శాంతమ్మ దంపతులకి మరో 12 ఏళ్ల కుమారుడు కూడా వున్నాడు. ఈమధ్యే ఓ ఇల్లు తీసుకున్న శశిభూషణ్.. త్వరలోనే తన కొడుకుతో కలిసి ఆ ఇంట్లోకి మారాలనుకున్నట్టు తెలుస్తోంది. శశిభూషణ్ హత్య వెనుక ఇది కూడా ఓ కారణమై వుండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం శాంతమ్మ కొడుకు ఆమె దగ్గరి బంధువుల సంరక్షణలో వున్నట్టు పోలీసులు తెలిపారు. మూడు నెలల క్రితమే శశిభూషణ్ హత్యకి ప్లాన్ చేసినట్టుగా పోలీసుల విచారణలో వెల్లడైంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.