యాప్నగరం

బస్సులోనే కన్నతల్లిని నరికి చంపాడు

అతడి తల్లి ముత్తమ్మాళ్ పేరిట రెండెకరాల స్థలం ఉంది. కొడుకు సరిగ్గా చూసుకోకపోవడంతో ఆమె ఆస్తిలో వాటా ఇవ్వకుండా కుమార్తెలతో కలిసి ఉంటోంది. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని దేవరాజ్ చాలాసార్లు తల్లితో గొడవ పడేవారు.

Samayam Telugu 20 Dec 2018, 2:15 pm

ప్రధానాంశాలు:

  • కొడుకు సరిగా చూడటం లేదని కూతురి దగ్గర ఉంటోంది
  • ఆస్తి రాసివ్వడం లేదని తల్లిపై కేసు పెట్టాడు
  • కోర్టుకు హాజరై వెళ్తున్న తల్లిని బస్సులో నరికి చంపేశాడు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu murder2_647.
బస్సులోనే ఓ వ్యక్తి కన్నతల్లిని నరికి చంపిన సంఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో కలకలం రేపింది. చెన్నై సమీపంలోని గూడువాంజేరి కాయరంపెడు గ్రామం తిరువళ్లువర్ వీధికి చెంది దేవరాజ్(53) ఓ సంస్థలో కాపలాదారుడిగా పనిచేస్తున్నాడు. అతడి తల్లి ముత్తమ్మాళ్ పేరిట రెండెకరాల స్థలం ఉంది. కొడుకు సరిగ్గా చూసుకోకపోవడంతో ఆమె ఆస్తిలో వాటా ఇవ్వకుండా కుమార్తెలతో కలిసి ఉంటోంది. తనకు ఆస్తిలో వాటా ఇవ్వాలని దేవరాజ్ చాలాసార్లు తల్లితో గొడవ పడేవారు. దీనిపై కోర్టులో కేసు వేశాడు. దీని విచారణ కోసం ముత్తమ్మాళ్, ఆమె కూతురు విజయలక్ష్మి మంగళవారం కోర్టుకు హాజరయ్యారు.
తిరిగి ఇంటికి వెళ్లేందుకు రాత్రి 7 గంటల సమయంలో తాంబరం బస్టాండ్‌కు వచ్చారు. కోవూరుకి వెళ్లే బస్సు ఎక్కి కూర్చున్నారు. ఆ సమయంలో బస్సులోకి ఎక్కిన దేవరాజ్ ఒక్కసారిగా కత్తితో తల్లి, సోదరిపై దాడికి పాల్పడ్డాడు. తీవ్రంగా గాయపడిన ముత్తమ్మాళ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. విజయలక్ష్మి తీవ్రంగా గాయపడింది. సమాచారం అందుకున్న తాంబరం పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని నిందితుడు దేవరాజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. విజయలక్ష్మిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.