యాప్నగరం

భార్యను చంపి... స్నేహితుడికి ఫోన్ చేసి...

తాగుడుకు బానిసైన వ్యక్తి కోపంతో భార్యను చంపేసి.. ఆ విషయాన్ని ఓ స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు.

TNN 8 May 2017, 2:03 pm
తాగుడుకు బానిసైన వ్యక్తి కోపంతో భార్యను చంపేసి.. ఆ విషయాన్ని ఓ స్నేహితుడికి ఫోన్ చేసి చెప్పాడు. ముంబయి దగ్గర్లోని గోతివాతి గ్రామంలో ఈ ఘటన జరిగింది. జయేష్ మహాలిమ్, వైశాలి (30) భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు కూడా ఉన్నారు. జయేష్ తాగుడుకు బానిసవ్వడంతో ఏ ఉద్యోగంలోనూ స్థిరంగా ఉండలేదు. కొన్ని నెలలుగా ఖాళీగా ఉంటున్నాడు. దీంతో వైశాలి పని చేస్తూ ఇంటిని పోషిస్తోంది. తరచూ తాగడానికి డబ్బులు ఇవ్వమంటూ జయేష్ భార్యను వేధిస్తుండేవాడు. కాగా ఆదివారం రాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న భార్య గొంతు కోసి హత్య చేశాడు జయేష్. అనంతరం అక్కడ్నించి పారిపోయాడు.
Samayam Telugu man kills wife calls up friend and tells him about murder
భార్యను చంపి... స్నేహితుడికి ఫోన్ చేసి...


మరుసటి రోజు మధ్యాహ్నం తన స్నేహితుడికి ఫోన్ చేసి భార్యను చంపినట్టు చెప్పాడు. వెంటనే అతడి స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా... వైశాలి రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. పోలీసులు హత్యకేసు నమోదు చేసి జయేష్ కోసం వెతుకుతున్నారు. తల్లీ హత్యకు గురవ్వడం, తండ్రి పరారీలో ఉండడంతో... ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.