యాప్నగరం

రైలు పట్టాలపై పడుకుని.. పరుగులు పెట్టించాడు!

ముంబయిలోని కుర్లా రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు వెంటనే ప్లాట్‌ఫాం మీద నుంచి కిందికి దూకి అతడిని రక్షించారు.

Samayam Telugu 31 Jul 2018, 4:42 pm
ముంబయిలోని కుర్లా రైల్వే స్టేషన్‌లో ఓ వ్యక్తి పట్టాలపై పడుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అక్కడే ఉన్న ప్రయాణికులు వెంటనే ప్లాట్‌ఫాం మీద నుంచి కిందికి దూకి అతడిని రక్షించారు. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఇదంతా స్టేషన్లోని సీసీటీవీ కెమేరాలో రికార్డైంది.
Samayam Telugu Untitled


నరేంద్ర దామాజీ కొటెకర్ (54) అనే వ్యక్తి సెక్యూరిటీగా పనిచేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబ భారాన్ని మోయలేక ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రైల్వే స్టేషన్‌కు వచ్చి పట్టాలపై పడుకున్నాడు. రైలు ప్లాట్‌ఫాం మీదకు రాకముందే ప్రయాణికులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది అతడిని అక్కడి నుంచి ప్లాట్‌ఫాం మీదకు చేర్చారు. కొటేకర్ కుటుంబీకులకు ఈ సమాచారం అందించి, కౌన్సిలింగ్ అనంతరం వారికి అప్పగించారు.
సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఆత్మహత్యయత్నం దృశ్యాలు:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.