యాప్నగరం

Amritpal Singh: బైక్ నడిపిన వ్యక్తి అమృత్‌పాల్‌కు అత్యంత సన్నిహితుడు.. సీసీటీవీ ఫుటేజ్‌‌లో సంచలన విషయాలు

ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Singh)‌ ను పట్టుకునే ఆపరేషన్ ఎంత వరకు వచ్చిందని, దీనికి సంబంధించిన ప్రస్తుత నివేదికను సమర్పించాలని పోలీసులు పంజాబ్ హరియాణా హైకోర్టు ఆదేశించింది. అమృత్‌పాల్‌ సింగ్‌ తప్పించుకోవడంపై పంజాబ్‌ హైకోర్టు మండిపడింది. 80 వేల మంది పోలీసుల కన్నుగప్పి అతను ఎలా తప్పించుకున్నాడు అని ప్రశ్నించింది. గడ్డం, తలపాగా ధరించి బజాబ్ ప్లాటినా బైక్‌ను నడిపిన వ్యక్తిని పాపల్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 22 Mar 2023, 10:11 am

ప్రధానాంశాలు:

  • పోలీసుల కళ్లుగప్పి తప్పించుకున్న ఖలిస్థానీ సానుభూతిపరుడు
  • బైక్ నడిపిన వ్యక్తిని మాజీ జర్నలిస్ట్‌గా గుర్తించిన పోలీసులు
  • నలుగురు కీలక అనుచరుల్ని అదుపులోకి తీసుకుని విచారణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Amritpal Singh
బైక్‌పై అమృత్‌పాల్ సింగ్‌ను తీసుకెళ్లిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. ఖలిస్థానీ సానుభూతిపరుడు పోలీసుల నుంచి ఎలా తప్పించుకున్నదీ పలు సీసీటీవీ కెమెరా ఫుటేజ్‌లు బయటపెట్టాయి. గడ్డం, తలపాగా ధరించి బజాబ్ ప్లాటినా బైక్‌ను నడిపిన వ్యక్తిని పాపల్‌ప్రీత్ సింగ్‌గా గుర్తించినట్టు పోలీస్ వర్గాలు తెలిపాయి. మాజీ జర్నలిస్ట్ అయిన పప్పల్‌ప్రీత్.. అమృత్‌పాల్ సింగ్‌‌కు అత్యంత సన్నిహితుడు. ఖలీస్థాన్ నాయకుడిగా చెప్పుకునే అమృత్‌పాల్ సింగ్‌ వెనుక ఉన్న ప్రధాన శక్తిగా అభివర్ణించారు. గత నెలలో పోలీస్ స్టేషన్‌పై అతడి మద్దతుదారులు దాడికి పాల్పడిన తర్వాత అమృత్‌పాల్ సింగ్‌ వెలుగులోకి వచ్చారు.
చిక్కినట్టే చిక్కి తప్పించుకున్న అమృత్‌పాల్ సింగ్‌ కోసం నాలుగు రోజులుగా పోలీసుల వేట కొనసాగుతోంది. అయినా, అతడి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. ఈ నేపథ్యంలో అమృత్‌పాల్‌ సింగ్‌ పంజాబ్‌ దాటి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన ఓ కారులో టోల్‌గేట్‌ దాటిన వీడియో ఒకటి ప్రస్తుతం వైరల్‌ అవుతోంది. అమృత్‌పాల్‌ సింగ్‌ చివరిసారిగా మెర్సిడెస్‌ ఎస్‌యూవీలో తప్పించుకున్నాడు. అయితే, ప్రస్తుతం అతను మారుతీ సుజికీ బ్రీజా కారులో జలంధర్‌ టోల్‌గేట్‌ (toll booth)ను దాటుతున్న దృశ్యాలు అక్కడ ఉన్న సెక్యూరిటీ ఫుటేజ్‌ (security footage)లో రికార్డయ్యాయి.

పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కార్లు, వేషాలు మారుస్తున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఇతరులు గుర్తుపట్టకుండా సిక్కు దుస్తులకు బదులు చొక్కా, ప్యాంటు ధరించినట్లు పేర్కొంటున్నాయి. అతడి చివరిసారిగా ప్రయాణించిన మెర్సిడేస్ కారును జలంధర్‌లోని షాకోట్‌లో గుర్తించారు. అందులో ప్రయివేట్ వాకీటాకీ, రైఫిల్, 57 లైవ్ కాట్రిడ్జ్లు, కత్తి, పెద్ద సంఖ్యలో నెంబరు ప్లేట్లు లభ్యమయ్యాయి.

పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఐఎస్ఐతో సంబంధాలున్న అమృత్‌పాల్ సింగ్‌‌కు సహకరించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. అమృతపాల్ సింగ్ నంగల్ అంబియన్ గురుద్వారాకు వెళ్లాడని, అక్కడ అతను రెండవసారి బట్టలు మార్చుకున్నాడని, తర్వాత బైక్‌లకు మారాడని విచారణలో వారు వెల్లడించారు.

Read More Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.