యాప్నగరం

ఓట్ల కోసం ఫీట్లు.. షూ పాలిష్ చేసిన అభ్యర్థి

ఓట్ల కోసం ఎన్ని ఫీట్లు బాసూ.. ఎన్నికల గుర్తు షూ అంట.. రోడ్డు పక్కన కూర్చొని వచ్చేపోయే జనాల షూ పాలిష్ చేస్తున్నారు.

Samayam Telugu 26 Nov 2018, 6:06 pm
కూటి కోసం కోటి విద్యలన్నారు పెద్దలు. మరి రాజకీయాల విషయానికొస్తే.. ఓటు కోసం కోటి విద్యలు అనాలేమో. మరి ఎన్నికల సంగ్రామంలో గెలవాలంటే ఓటరు దేవుడి కరుణ ఉండాల్సిందే కదా. ఆ ఓటురును ప్రసన్నం చేసుకోవాలంటే తిప్పలు తప్పవు. అసలే ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల సీజన్ నడుస్తోంది. అభ్యర్థులంతా ప్రజా క్షేత్రంలో ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీ. అందుకే ఈ ప్రచారంలోనూ క్రియేటివ్ టచ్ ఇస్తున్నారు కొందరు పొలిటీషియన్లు.. చిత్ర విచిత్రమైన ఫీట్లతో ఓటర్లను ఆకర్షిస్తున్నారు.
Samayam Telugu sheo.


మధ్యప్రదేశ్‌లో ఓ స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ప్రచారంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. ఎమ్మెల్యే పదవికి రాష్ట్రీయం ఆంజాన్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న శరద్ సింగ్ కుమార్ ఓటరు దేవుళ్లను ప్రసన్నం చేసుకునే పనిలో సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. తన ఎన్నికల గుర్తైన షూను ఓటర్లకు పరిచయం చేసేందుకు.. రోడ్డుపై వెళ్లే వారి షూస్‌ను పాలిష్ చేస్తున్నారు. ఈ వింత ప్రచారం ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది.

తన ఎన్నికల గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకే ఈ వినూత్న ప్రచారం మొదలు పెట్టానంటున్నారు శరద్. షూ గుర్తును తాను అదృష్టంగా భావిస్తున్నానని.. ప్రతి వ్యక్తికి ఉచితంగా పాలిష్ చేస్తూ ఓటు వెయ్యాలని వేడుకుంటున్నానని చెప్పారు. ఇలా ప్రచారం చేయడంలో తప్పేమీ లేదన్నారు. మరి శరద్ ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.