యాప్నగరం

Mainpuri: రూ.45 రూపాయల చోరీకి... 24 ఏళ్ల పాటు విచారణ.. పైగా విచిత్రమైన శిక్ష

ఉత్తరప్రదేశ్‌లోని (Mainpuri) ఓ కోర్టు ఇచ్చిన తీర్పు వైరల్‌గా మారింది. కేవలం రూ.45లు కొట్టేసినందుకు ఓ వ్యక్తిని పోలీసులు పట్టుకున్నారు. జైలుకు పంపించారు. అయితే అతను బెయిల్‌పై బయటకు వచ్చేశాడు. కానీ ఆ కేసు 24 ఏళ్లుగా సాగుతూనే ఉంది. ఫైనల్‌గా ఇప్పుడు ఈ కేసులో కోర్టు తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు కూడా విచిత్రంగా ఉంది. ఈ మాత్రం శిక్షకు ఇన్నేళ్లుగా ఎందుకు విచారణ చేశారా..? అనేలా శిక్ష ఉంది. మొత్తాన్నికి ఇన్నేళ్లకు ఆ వ్యక్తి విముక్తి లభించిందను కోవాలి.

Authored byAndaluri Veni | Samayam Telugu 5 Oct 2022, 4:38 pm

ప్రధానాంశాలు:

  • ఉత్తరప్రదేశ్‌లో వింత కేసు
  • రూ.45లు దొంగిలించిన వ్యక్తి
  • 24 ఏళ్ల నుంచి కోర్టులో సాగుతున్న విచారణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Mainpuri Stealing case
Mainpuri: మన దేశంలో కోర్టులు, విచారణలు గురించి చాలామందికి తెలుసు. ఒక కేసులో విచారణ జరిగి.. దానిపై తీర్పు రావడానికి చాలా ఏళ్లు పడుతుంది. విడాకుల కేసు నుంచి.. హత్య కేసుల వరకు ఇదే తంతు. ఉత్తరప్రదేశ్‌లో ఒక దొంగతనం కేసులో 24 ఏళ్ల తర్వాత ఇచ్చిన తీర్పు దీనికి ఉదాహరణగా నిలిచింది. ఆ తీర్పు వైరల్ అయింది. ఓ వ్య‌క్తి జేబులో నుంచి 45 రూపాయ‌లు కొట్టేసిన దొంగ‌ను ప‌ట్టుకుని 24 ఏళ్లకు కోర్టు జైలు శిక్ష విధించింది.
1998లో మైన్‌పురిలోని ఛపట్టీ ప్రాంతానికి చెందిన వీరేంద్ర బాధమ్ జేబులో నుంచి ఓ వ్యక్తి డబ్బులు కొట్టేశాడు. లైన్‌గంజ్ ప్రాంతంలో ఈ చోరీ జరిగిందని గుర్తించిన వీరేంద్ర.. సమీపంలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీనిపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ చోరీని ఇటావాలోని భూరా ప్రాంతానికి చెందిన మన్నన్ చేసినట్టు గుర్తించి.. పట్టుకున్నారు. అతను దొంగతనం చేసిన రూ.45లను స్వాధీనం చేసుకుని.. కోర్టు ముందు హాజరు పరిచారు.

మైన్‌పురిలోని సీజేఎం కోర్టు ఆదేశాల‌తో 1998 ఏప్రిల్ 18న మ‌న్న‌న్‌ను జైలుకు పంపించారు. రిమాండ్ ఖైదీగా 81 రోజులు మన్నన్ జైల్లో ఉన్నాడు. తర్వాత బెయిల్‌పై బయటకొచ్చాడు. అప్పటి నుంచి ఆ కేసు విచారణ జరుగుతూనే ఉంది. 24 ఏళ్లు అయిపోయింది. దాంతో మన్నన్ ఈ కేసు నుంచి బయటపడాలనుకుని.. తానే దొంగతనం చేశానని ఒప్పుకున్నారు. గత నెల 28న కోర్టులో తానే చోరీ చేసినట్టు అంగీకరించాడు. దాంతో కోర్టు మన్నన్‌కు నాలుగు రోజుల జైలు శిక్ష విధించింది. శిక్ష ఖరారు చేసిన తర్వాత సీజేఎం అతడిని జైలుకు పంపించారు. నాలుగు రోజుల శిక్ష పూర్తయ్యాక జైలు నుంచి విడుదల కానున్నారు.

Read Also:అర్ధరాత్రి టీచర్ల హల్‌చల్... పెట్రోల్ బాటిల్‌తో వాటర్ ట్యాంక్‌పైకి ఎక్కి... బెదిరింపులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.