యాప్నగరం

దారుణం.. పిల్లలను సజీవదహనం చేసిన తండ్రి

అభం శుభం తెలియని చిన్నారులపై పెట్రోల్ పోసి.. నిప్పంటించిన తండ్రి. భార్య వదిలేసిందనే కక్షతో చిన్నారులను బుగ్గిచేసిన కసాయి తండ్రి.

Samayam Telugu 29 Oct 2018, 9:28 pm
వాడు.. మనిషి కాదు, నాన్న రూపంలో ఉన్న నరరూప రాక్షసుడు. చిన్నారులనే కనికారం కూడా లేకుండా ఇద్దరు పిల్లలపై పెట్రోల్ పోసి నిప్పటించి, అతను కూడా నిప్పు పెట్టుకున్నాడు. ఈ ఘటన బెంగళూరులోని త్యాగరాజనగర్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఒక మరణించగా, మరొక బాలుడు ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు.
Samayam Telugu pihuq


పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్న శ్రీనివాస్ మూర్తి(32)కి భార్య, కొడుకులు చెతన్ సాయి (5), సాయి చరన్ (20 నెలలు) ఉన్నారు. మూర్తి మద్యానికి బానిస కావడంతో గత ఏడు నెలల నుంచి అతని భార్య అతడికి దూరంగా ఉంటుంది. పిల్లలను కూడా తన వెంట తీసుకెళ్లిపోయింది.

శనివారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో త్యాగరాజనగర్‌లోని భార్య ఇంటికి వెళ్లిన మూర్తి.. పిల్లలను తనతో తీసుకెళ్తానని, తిరిగి ఆదివారం తీసుకొచ్చేస్తానని భార్యతో నమ్మబలికాడు. దీంతో ఆమె పిల్లలను మూర్తితో పంపింది. శనివారం అర్ధరాత్రి దాటక.. ఆదివారం 2 గంటలకు పిల్లలు ఇద్దరిపైనా పెట్రోల్ పోసి నిప్పంటించాడు. అనంతరం అతను కూడా నిప్పంటిచుకున్నాడు. పిల్లల అరుపులు విన్న స్థానికులు వారిని ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనలో సాయి చరణ్ పూర్తిగా కాలిపోయి చనిపోగా, చేతన్ సాయి 80 శాతం కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నాడు. నిందితుడు మూర్తికి 40 శాతం గాయాలయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.