యాప్నగరం

గన్‌తో కాల్చి, బాంబ్ పేల్చి.. దుర్గా మండపంలో దారుణ హత్య

దుర్గా మండపంలో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన దుండుగులు. చుట్టూ జనం చూస్తుండగానే.. తుపాకీతో కాల్చిన దుండగులు.. బాంబు పేలడంతో పలువురికి గాయాలు.

Samayam Telugu 18 Oct 2018, 11:16 am
పట్టపగలు.. జనాలు చూస్తుండగా.. దుర్గామాత మండపంలో దారుణ హత్య జరిగింది. ఓ వ్యక్తిని తుపాకీతో కాల్చి.. బాంబు పేల్చి మరి దారుణంగా హతమార్చారు. ఉత్తరప్రదేశ్‌లోని జరిగిన ఈ ఘటన కలకలంరేపింది. పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం.. అలహాబాద్‌లోని రాజ్‌పూర్ కాలనీకి చెందిన నీరజ్ బల్మకీపై పాత నేరస్థుడు. ఈ మధ్యే జైలు నుంచి విడుదలయ్యాడు. అతడి బయటకు వచ్చాడని తెలుసుకున్న ప్రత్యర్థులు.. పక్కా ప్లాన్‌ ప్రకారం హత్యకు ప్లాన్ చేశారు.
Samayam Telugu Murder


నీరజ్ దుర్గా పూజ సమితి అధ్యక్షుడు కావడంతో.. మండపంలో అమ్మవారికి పూజ చేసేందుకు వచ్చాడు. ఇదే అదునుగా భావించిన ప్రత్యర్థులు.. మండపంలోకి చొరబడ్డారు. వచ్చీరాగానే తుపాకీలతో కాల్పులు జరిపారు.. నీరజ్ వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. అతడిపై కాల్పులు జరిపి.. బాంబ్ కూడా పేల్చారు. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ ఘటనలో అతడు ప్రాణాలు కోల్పోయాడు.

పట్టపగలు జరిగిన ఈ దారుణ ఘటన సంచలనం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండపంలోని సీసీ కెమెరాల్లో దాడి ఘటన రికార్డయ్యింది. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు పోలీసులు. మరోవైపు మండపంలో బాంబ్ కూడా పేలడంతో.. ఇద్దరు ముగ్గురికి గాయాలు కూడా అయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.