యాప్నగరం

కూతుళ్లను రైలు నుంచి తోసేసిన తండ్రి

కూతుళ్లను కనుపాపలా కాపాడాల్సిన కన్న తండ్రి... కర్కసంగా, కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేసిన ఘటన ఇది.

TNN 25 Oct 2017, 2:10 pm
కూతుళ్లను కనుపాపలా కాపాడాల్సిన కన్న తండ్రి... కర్కసంగా, కదులుతున్న రైలు నుంచి బయటకు తోసేసిన ఘటన ఇది. రైల్వే పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్‌కు చెందిన వ్యక్తి తన ముగ్గురు కూతుళ్లతో పంజాబ్‌లోని అమ్రుత్‌సర్‌కు వెళ్లారు. మంగళవారం అమ్రుత్‌సర్ - సహర్సా ఎక్స్‌ప్రెస్ నుంచి తిరుగు ప్రయాణం అయ్యారు.
Samayam Telugu man throws three minor daughters from moving train in uttar pradesh one killed
కూతుళ్లను రైలు నుంచి తోసేసిన తండ్రి


లక్నోకు దాదాపు 90 కిమీల దూరంలో గల సీతాపూర్‌‌ వద్ద వేగంగా వెళ్తున్న రైలు నుంచి ముగ్గురు కూతళ్లను తోసేశాడు. రైల్వే ట్రాక్ పొడవునా వేర్వేరు ప్రాంతాల్లో పడివున్న ముగ్గురిని స్థానికులు కాపాడారు.

ఈ ఘటనలో అల్గున్ ఖాతనూ (5), షమీమ్ (9)లు తీవ్రంగా గాయపడగా.. మునియా(7) అక్కడిక్కడే మరణించింది. ఐదేళ్ల చిన్నారి అల్గున్ తన తండ్రే బయటకు తోసేశాడని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. వీరి తండ్రి ప్రస్తుతం పరారిలో ఉన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.