యాప్నగరం

రెస్టారెంట్ యజమానిపై కాల్పులు..

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన సినిమాను తలపించింది. ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని వచ్చి రెస్టారెంట్‌ కౌంటర్‌లో కూర్చున్న యజమానిపై కాల్పులు జరిపి.. పట్టుకోవాలని ప్రయత్నించిన వారికి చిక్కకుండా అక్కడి నుంచి తుర్రుమన్నాడు.

Samayam Telugu 30 Jul 2018, 8:08 pm
ఉత్తరప్రదేశ్‌లోని ఓ రెస్టారెంట్‌లో జరిగిన సంఘటన సినిమాను తలపించింది. ఓ వ్యక్తి తుపాకీ పట్టుకుని వచ్చి రెస్టారెంట్‌ కౌంటర్‌లో కూర్చున్న యజమానిపై కాల్పులు జరిపి.. పట్టుకోవాలని ప్రయత్నించిన వారికి చిక్కకుండా అక్కడి నుంచి తుర్రుమన్నాడు. సుల్తాన్‌పూర్‌ పట్టణంలో ఉన్న అవంతిక రెస్టారెంట్‌లో ఆదివారం (జులై 29) రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
Samayam Telugu shoot


వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్‌ పట్టణంలో ఉన్న అవంతిక రెస్టారెంట్ ఎప్పటిలాగే జనాలతో కిటకిటలాడుతోంది. వచ్చిపోయే వారితో అక్కడ అంతా సందడిగా ఉంది. యజమాని అలోక్ ఆర్య క్యాష్ కౌంటర్‌లో బిజీగా ఉన్నారు. ఇంతలో కౌంటర్ దగ్గరకు వచ్చిన ఓ వ్యక్తి అందరూ చూస్తుండగానే రెస్టారెంట్‌ యజమానిపై మూడు సార్లు కాల్పులు జరిపాడు.

కొందరు అతడిని ఆపేందుకు ప్రయత్నిస్తుండగానే నిందితుడు తప్పించుకుని పారిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి కస్లమర్లు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. అక్కడున్న సీసీటీవీలో ఈ ఘటన రికార్డైంది. బుల్లెట్ గాయాలైన అలోక్‌ కౌంటర్‌ నుంచి బయటకు వచ్చి కుప్పకూలారు. రెస్టారెంట్‌ సిబ్బంది ఆయనను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని డాక్టర్లు ప్రకటించారు.

సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తించారు. అతడు స్థానిక కాంట్రాక్టర్. అతడు కాల్పులు జరపడానికి కచ్చితమైన కారణం తెలియలేదు. అయితే అంతకుముందే రెస్టారెంట్ వెయిటర్‌‌తో ఆ వ్యక్తి గొడవపడ్డాడు. ఆ సమయంలో ఓనర్ అలోక్ ఆర్యా జోక్యం చేసుకొని ఆ వ్యక్తిని అక్కడి నుంచి పంపించేశాడు. రెండు గంటల తర్వాత మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి వచ్చి అలోక్‌ పై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.