యాప్నగరం

విషాదం: ప్రాణం తీసిన మాంజా.. రాఖీ కోసం సోదరి ఇంటికి వెళ్తుండగా అనూహ్య ఘటన

రాఖీ పండగ పూట చైనా మాంజా దేశ రాజధాని ఢిల్లీలో ఓ వ్యక్తి ఒకరి ప్రాణాలు బలితీసుకుంది. తన కళ్ల ముందే భర్త మృతి చెందడంతో భార్య తీవ్ర విషాదంలో మునిగిపోయింది. బైక్‌పై భార్యతో కలిసి రాఖీ కట్టించుకోడానికి తన సోదరి ఇంటికి బయలుదేరాడు. ఈ సమయంలో అనూహ్య రీతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రజల ప్రాణాలు చైనా మాంజాలపై నిషేధం కొనసాగుతున్నా.. అమ్మకాాలు మాత్రం ఆగడం లేదు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 13 Aug 2022, 12:58 pm

ప్రధానాంశాలు:

  • రాఖీ కోసం సోదరి ఇంటికి భార్యతో యువకుడు.
  • మార్గమధ్యలో మెడకు బిగిసుకున్న చైనా మాంజా
  • నిషేధం కొనసాగుతున్నా పట్టించుకోని జనం.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu చైనా మాంజా మరణం
రాఖీ పండుగ (Rakshabandhan) వేళ దేశ రాజధానిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. రాఖీ (Rakhi) కట్టించుకోడానికి సోదరి ఇంటికి వెళ్తున్న వ్యక్తి ప్రమాదవశాత్తూ ప్రాణాలు కోల్పోయాడు. భార్యతో కలిసి బైక్‌పై వెళ్తున్న అతడికి గాలిపటం మాంజా (China Manjha) మెడకు బిగుసుకుని ఊపిరాడక చనిపోయాడు. గతంలో ఇటువంటి సంఘటనలు జరగడంతో 2016 నుంచి ఢిల్లీలో చైనా మాంజాల (China Manjha Ban) వినియోగంపై నిషేధం కొనసాగుతోంది. కానీ, నిబంధనలకు విరుద్దంగా పెద్ద సంఖ్యలో వినియోగిస్తున్నారు. రాజధాని ఢిల్లీలో ఈ నెలలో మంజాతో ప్రాణాలు కోల్పోయిన రెండో ఘటన ఇది.

నాంగ్లోయ్‌ రాజధాని పార్క్‌లో నివాసం ఉండే విపిన్ కుమార్ (35) రాఖీ పండుగను జరుపుకోడానికి లోనిలో ఉండే తన సోదరి ఇంటికి భార్యతో కలిసి వెళ్తున్నాడు. వీరి బైక్ శాస్త్రి పార్క్ (Shastri Park) ఫ్లైఓవర్ వద్దకు చేరుకోగానే గాలిపటం మాంజా వేగంగా వచ్చి ఆయన గొంతుకు బిగిసుకోవడంతో గాయపడ్డాడు. తక్షణమే స్పందించిన భార్య, అటుగా వెళ్తున్న వ్యక్తులు.. విపిన్‌ను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. కానీ, అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. కాసేపట్లో సోదరికి ఇంటికి చేరుకుంటారనగా ఊహించని ఈ ప్రమాదం ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది.
ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు.. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కాగా, గాలిపటాలను ఎగురవేయడానికి వినియోగించే సింథటిక్ చైనా మాంజాలను నిషేధించాలన్ని జాతీయ హరిత ట్రైబ్యునల్ (National Green Tribunal) మార్గదర్శకాలను అమలు చేయడానికి ఎటువంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని నగర పోలీసులను ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) ఇటీవల ఆదేశించింది. పక్షులతో పాటు ప్రజలు ప్రాణాలను హరిస్తోన్న చైనా మాంజాలను పూర్తిగా నిషేధించాలన్న ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరుపుతోంది.

చైనా మాంజాలను నైలాన్‌‌‌‌తో తయారు చేస్తారు. దీని తయారీలో గాజు పొడి పూసిన నైలాన్ లేదా సింథటిక్ దారాలను వాడుతారు. గాలిపటం ఎగురవేసిన సమయంలో చైనా మాంజా తెగకుండా ఉంటుంది. స్వాతంత్రదినోత్సవం రోజున చైనా మాంజాతో ఎగురవేసిన పంతగులు ఇద్దరి చిన్నారుల ప్రాణాలు తీయడంతో 2016లో ఢిల్లీ ప్రభుత్వం వీటిని నిషేధించింది.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.