యాప్నగరం

Mangaluru బైక్​ వెనుక సీటు​పై మగాళ్లు కూర్చోవద్దు.. పోలీసుల వింత రూల్‌తో అవాక్కైన జనం!

కర్ణాటకలో పది రోజుల వ్యవధిలో జరిగిన మూడు వరుస హత్యలతో ఉద్రిక్తతలు నెలకున్నాయి. జులై 19న కేరళ యువకుడు మసూద్ (18) హత్య, ఇది జరిగిన రెండు రోజుల తర్వాత సూరత్కల్‌లో మహ్మద్ ఫాజిల్ (23) అనే యువకుడిపై దాడి తర్వాత బీజేపీ యువనేత ప్రవీణ హత్యతో మంగళూరు ప్రాంతంలో పరిస్థితి నివురుగప్పి నిప్పులా తయారయ్యింది. మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన హత్యలతో మంగళూరు పోలీసులు తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీసింది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 5 Aug 2022, 1:45 pm
మంగళూరు పోలీసులు (Mangalore Police )విధించిన ఆంక్షలపై ప్రజల నుంచి విమర్శలు రావడంతో వెనక్కితగ్గారు. మంగళూరు కమిషనరేట్ పరిధిలో బైక్ వెనుక సీట్పై పురుషులు (Male Pillion Riders) ప్రయాణించడంపై నిషేధం విధించారు. దీనిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆంక్షలు విధించిన గంటలోనే ఉత్తర్వులను వెనక్కు తీసుకుంటున్నట్లు పోలీస్ కమిషనర్ శశికుమార్ ప్రకటించారు. పది రోజుల వ్యవధిలో వరుస మూడు హత్యలు (Karnataka Killings) దక్షిణ కన్నడ జిల్లాలో మతపరమైన ఉద్రిక్తతలకు కారణమైన నేపథ్యంలో మంగళూరు పోలీసులు తీసుకున్న నిర్ణయం చర్చకు దారితీసింది.
Samayam Telugu బైక్‌పై వెనుక సీటులో కూర్చువడం నిషేధం


తమ కమిషనరేట్ పరిధిలో ద్విచక్రవాహనం వెనుక పురుషులు ప్రయాణించడంపై నిషేధం విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బైక్లపై పురుషులెవరూ వెనుక సీట్పై ప్రయాణించరాదని పేర్కొన్నారు. కానీ, 18 ఏళ్లలోపు వారికి, వృద్ధులకు దీనిని నుంచి మినహాయింపు ఉంటుందని తెలిపారు. ఈ ఆంక్షలు ఆగస్టు 8 వరకు కొనసాగుతాయని స్పష్టం చేశారు.

144 సెక్షన్ అమలుచేసిన పోలీసులు.. బహిరంగ ప్రదేశాల్లో నినాదాలు, ప్రజల్ని రెచ్చగొట్టేలా మాట్లాడటం, ఆందోళనలకు దిగడం, ఫొటోలు/ పోస్టర్లు ప్రదర్శించడం.. ఆయుధాలతో తిరగడం, టపాసులు పేల్చడం, దిష్టిబొమ్మలు దగ్దం కూడా నిషేధం విధించారు. అంతేకాదు, ఆగస్టు 8 వరకు ప్రైవేటు ఫంక్షన్లు, వేడుకలు, ర్యాలీలు నిర్వహించవద్దని ఆదేశించారు. పోలీసుల విచిత్ర ఆంక్షలపై విస్మయం వ్యక్తం చేసిన ప్రజలు.. తీవ్రంగా వ్యతిరేకించడంతో యూటర్న్ తీసుకున్నారు.

మంగళూరు జిల్లాలో పది రోజుల వ్యవధిలో జరిగిన మూడు వరుస హత్యలతో ఉద్రిక్తతలు నెలకున్నాయి. ముఖ్యంగా బీజేపీ యువ ప్రవీణ్ నెట్టారును కొందరు కిరాతకంగా హత్య చేయడం తీవ్ర దుమారం రేగింది. ప్రవీణ్ హత్యకు నిరసనగా హిందూ సంఘాల భారీ ర్యాలీలు, ఆందోళనలు చేపట్టాయి. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వంపై మండిపడుతూ.. సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేశాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మంగళూరు పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఆంక్షలు విధించారు. ప్రజా ప్రయోజనాల కోసం ఇటువంటి ఆంక్షలు విధించినట్టు మంగళూరు సీపీ శశి కుమార్ ప్రకటించినా.. చివరకు విమర్శలతో వెనక్కి తగ్గారు.

నగర వ్యాప్తంగా 19 చెక్ పోస్టులను ఏర్పాటుచేసిన పోలీసులు.. రాత్రిపూట అనవసరంగా రోడ్లపై తిరుగుతున్న 200కిపైగా వాహనాలను సీజ్ చేశారు. జులై 19న కేరళ యువకుడు మసూద్ (18)పై బళ్లారి సమీపంలో పలువురి దాడికి పాల్పడటంతో తీవ్రంగా గాయపడిన అతడు రెండు రోజుల తర్వాత మృతిచెందాడు. ఇది జరిగిన రెండు రోజుల తర్వాత సూరత్కల్‌లో మహ్మద్ ఫాజిల్ (23) అనే యువకుడ్ని దుండుగులు హత్య చేశారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.