యాప్నగరం

జాట్ల పోరు... ఢిల్లీ గజగజ!

రాజధాని నగరం సోమవారం స్థంభించనుంది. రిజర్వేషన్లపై జాట్లు భారీ ఆందోళనకు పిలుపివ్వడంతో పోలీసులు ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రమైన హర్యానా నుంచి భారీ సంఖ్యలో జాట్లు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేసేందుకు తరలిరానున్నారు.

TNN 19 Mar 2017, 4:01 pm
రాజధాని నగరం సోమవారం స్థంభించనుంది. రిజర్వేషన్లపై జాట్లు భారీ ఆందోళనకు పిలుపివ్వడంతో పోలీసులు ఢిల్లీలో అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ సరిహద్దు రాష్ట్రమైన హర్యానా నుంచి భారీ సంఖ్యలో జాట్లు ఢిల్లీలో పార్లమెంట్ ముట్టడి చేసేందుకు తరలిరానున్నారు. దీంతో, సోమవారం సెంట్రల్ ఢిల్లీతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్‌లోని రోడ్లు మూతపడనున్నాయి. మెట్రో రైళ్లు, పలు రైళ్ల సేవలను కూడా తాత్కాలికంగా నిలిపేయనున్నారు. శాంతి భద్రతలకు కూడా విఘాతం కలగవచ్చనే ఆందోళనతో పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
Samayam Telugu manic monday likely with traffic curbs for jat march
జాట్ల పోరు... ఢిల్లీ గజగజ!


జాట్ల ఆందోళన నేపథ్యంలో ఢిల్లీలో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్న విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు చేరేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. నొయిడా, గుర్గావ్‌లలో కూడా తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు తలెత్తనుంది. శాంతి భద్రతల నిమిత్తం ఢిల్లీ మెట్రో రైళ్లను ఆదివారం రాత్రి నుంచే నిలిపేస్తున్నారు. పోలీసుల ఆదేశాలు అందేవరకు సోమవారం కూడా మెట్రో రైళ్లు అందుబాటులోకి రావు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ అందుబాటులో లేకపోవడం వల్ల క్యాబ్, ఆటోల ధరలు కూడా ఆకాశాన్నంటే అవకాశం ఉంది. ఢిల్లీలో ప్రవేశించేవారు తప్పకుండా ఐడీ కార్డులను వెంట తీసుకురావాలని పోలీసులు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.