యాప్నగరం

ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్యే అయ్యాడు.. నిజమే.!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి అనూహ్యంగా ఎమ్మెల్యే అయ్యారు. ఉప ఎన్నిక నిర్వహించాలని దాఖలు చేసిన పిటిషన్‌‌‌ను విచారించిన సుప్రీం కోర్టు.. హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పడం ఆయనకు బాగా కలిసొచ్చింది.

Samayam Telugu 17 Apr 2021, 12:54 am
ఆయన ఎన్నికల్లో ఓడిపోయి ఎమ్మెల్యే అయ్యాడు.. అవును మీరు చదివింది అక్షరాలా నిజమే!! అయితే గెలిచిన వ్యక్తి కూడా ఇప్పుడు ఎమ్మెల్యే పదవిలో లేడు. ఈ ఆసక్తికర ఘటన మణిపూర్‌లో జరిగింది. 2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో హెన్రీ సింగ్ (32) ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో ఆయన 16 వేలకు పైగా ఓట్లు సాధించారు. ఆ తరువాతి స్థానంలో 12 వేల ఓట్లతో బీజేపీ అభ్యర్థి ఎరబోట్ సింగ్ నిలిచారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
court


అయితే ఎన్నికల అనంతరం హెన్రీ సింగ్ బీజేపీలో చేరడంతో ఆయనపై అనర్హత వేటు పడింది. అప్పటికే ఆయనపై హైకోర్టు కేసు నడుస్తోంది. అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని ప్రత్యర్థి కోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టులో విచారణ కొనసాగుతుండగానే హెన్రీ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తనపై అనర్హత వేటు వేసినందున వాంగ్‌కేయిలో ఉప ఎన్నిక నిర్వహించాలని కోరారు.

అయితే ఆయన పిటిషన్‌పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. అప్పటికే అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం పొందుపరిచారన్న కేసు విచారణలో ఉంది. ఈ కేసులో ఆయన కుటుంబ సభ్యులు, క్రిమినల్ కేసులకు సంబంధించి అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం ఇచ్చారని నిర్ధారించిన హైకోర్టు దిమ్మతిరిగే షాకిచ్చింది. ఉపఎన్నిక అవసరం లేకుండానే రెండో స్థానంలో నిలిచిన అభ్యర్థిని ఎమ్మెల్యేగా ప్రకటించేసింది. దీంతో ఎన్నికల్లో ప్రత్యర్థి చేతిలో ఓటమిపాలైన ఎరబోట్ సింగ్ ఎమ్మెల్యే అయ్యారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.