యాప్నగరం

Andhra Border Bandh: ఏఓబీలో మావోల బంద్ పిలుపు.. మన్యంలో పోలీసులు అలర్ట్

ఏఓబీ బంద్‌కు మావోల పిలుపు.. మన్యంలో పోలీసుల అలర్ట్.. అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం..

Samayam Telugu 20 Nov 2018, 12:35 pm
మల్కన్‌గిరి ఎన్‌కౌంటర్‌కు నిరసనగా మావోలు మంగళవారం ఏఓబీ (ఆంధ్ర, ఒడిశా బోర్డర్‌) బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ బంద్ పిలుపుతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మన్యంతో పాటూ ఆంధ్ర-ఒడిశా సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. సోమవారం రాత్రి నుంచే వాహనాల తనిఖీలను ముమ్మరం చేశారు. అలాగే ఏజెన్సీ ప్రాంతానికి వెళ్లే ఆర్టీసీ బస్సుల్ని కూడా నిలిపివేశారు. దాడులు జరిగే అవకాశం ఉండటంతో.. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ను కూడా ముమ్మరం చేశారు. ముఖ్యమైన ప్రజా ప్రతినిధులకు భద్రతను పెంచారు.
Samayam Telugu mavos


బలగాలు ప్రధానంగా ఏఓబీలోని తివ్వాకొండలపై దృష్టిపెట్టాయి. మావోల బంద్‌ పిలుపుతో గిరిజన గ్రామాలను జల్లెడ పట్టారు. ఆది వాసీలతో మాట్లాడుతూ.. కొత్త వ్యక్తుల సమాచారాన్ని సేకరించారు. స్పెషల్ టీమ్‌లను కూడా రంగంలోకి దించి.. కూంబింగ్‌ ముమ్మరం చేశారు. సీతంపేట, కొత్తూరు, బత్తిలి, కొత్తూరు, దోనుబాయి మార్గాల్లో స్పెషల్‌ పార్టీలు గస్తీ కాస్తున్నాయి. బంద్ కావడంతో ప్రజలు కూడా ఇళ్లలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు.

నవంబర్ 5న మల్కన్ గిరి జిల్లా బెజ్జింగ్‌వాడ సమీపంలోని అటవీ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు.. మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఇరువురి మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు చనిపోయారు. ఆ ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన సుశీల, సన్నాయి, మీనా తదితరులకు నివాళులు అర్పిస్తూ.. ఏఓబీ కార్యదర్శి జగబంద్.. ఈ బంద్‌కు పిలుపునిచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.