యాప్నగరం

దారికి అడ్డురావొద్దు: మావోయిస్టుల వార్నింగ్

తాము వెళ్లే దారికి రావొద్దని మావోయిస్టులు హెచ్చరించారు. తమకు పోలీసులు, జవాన్లపై పగలేదని,

Samayam Telugu 28 Apr 2017, 2:53 pm
తాము వెళ్లే దారికి అడ్డు రావొద్దని మావోయిస్టులు హెచ్చరించారు. తమకు పోలీసులు, జవాన్లపై పగలేదని, ప్రభుత్వం చేపడుతున్న గ్రీన్‌ హంట్‌ ఆపరేషన్‌ను నిరసిస్తూ సుక్మా దాడి చేసినట్లు చెప్పారు. ఈ మేరకు ఓ ఆడియో క్లిప్‌ను విడుదల చేశారు.
Samayam Telugu maoists warn better come in their way audio releases
దారికి అడ్డురావొద్దు: మావోయిస్టుల వార్నింగ్


ఛత్తీసగడ్‌లో సుక్మాలో మావోయిస్టులు దాడి చేసి 25మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మృత్యువాతపడ్డారు. ఈ దాడికి గల కారణాలు ఓ ఆడియో ద్వారా మావోయిస్టులు విడుదల చేశారు. పావుగంటపాటున్న ఈ ఆడియోలో మాట్లాడిన వ్యక్తి తనను వికల్ప్ గా పేర్కొన్నాడు.

హిందీలో మాట్లాడిన ఆయన విప్లవదారికి అడ్డు ఉండొద్దని హెచ్చరించారు. కేంద్ర బలగాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అమాయకులపై దాడులు, తమ మహిళలపై లైంగిక దాడులకు ప్రతీకారంగానే పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ(పీఎల్‌జీఏ) అనే సంస్థ ఈ దాడి చేసినట్లు పేర్కొన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.