గ్రామంలో నీటి సమస్య కారణంగా పెళ్లి సంబంధం రద్దయిన ఘటన కర్ణాటకలోని దావణగెరెలో చోటుచేసుకుంది. పెళ్లి సంబంధం కోసం వచ్చిన అమ్మాయి తల్లిదండ్రులు.. నీటికోసం గ్రామస్థులు పోట్లాట చూసి భయపడిపోయారు. దీంతో తమ కుమార్తెను ఇస్తే ఇదే పరిస్థితి తప్పదని వచ్చినదారినే వెనక్కి వెళ్లిపోయారు. దావణగెరె జిల్లాలోని హరిహర తాలూకా మలే బెన్నూరు గ్రామంలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. గుక్కెడు నీటి కోసం జనం నిత్యం కొట్టుకోవడం సర్వసాధారణంగా మారింది. ఆ గ్రామంలోని రెండో వార్డులో పరిస్థితి మరింత అధ్వాన్నం. ఇటీవల గ్రామానికి చెందిన హాలేశ్ అనే యువకుడికి పెళ్లి సంబంధం కోసం బానుహళ్లికి చెందిన యువతి తల్లిదండ్రులు గ్రామానికి వచ్చారు. ఆ సమయంలో నీటి కోసం గ్రామస్థులు పోట్లాడుకోవడం వారి కంటపడింది. ఘర్షణకు కారణమేమిటని గ్రామస్థులను ఆరా తీయగా నీటి కోసం పోట్లాడుకోవడం తమకు సర్వసాధారణమని చెప్పడంతో వారు అవాక్కయ్యారు.
దీంతో ఆలోచనలో పడిన యువతి తల్లిదండ్రులు.. ఈ గ్రామంలోని యువకుడితో తమ కుమార్తెకు వివాహం జరిపిస్తే ఆమె కూడా నీటికోసం పోట్లాడాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. గుడికి వెళ్లిన తరువాత యువకుడి ఇంటికి వెళ్లాలని తీసుకున్న తమ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అటు నుంచి అటే చెప్పాపెట్టుకుండా వెళ్లిపోయారు. అలా ఎందుకు చేస్తున్నారని కొందరు అడిగితే నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్న గ్రామంతో వియ్యమందుకోవడం తమకు ఇష్టం లేదని తెగేసి చెప్పారు.
రెండు నెలలుగా ఆ గ్రామానికి 15 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. అమ్మాయి తరఫువారు పెళ్లిచూపులకు వచ్చిన రోజే నీళ్లు సరఫరా కావడంతో నీటి కోసం మహిళలు పెద్ద సంఖ్యలో బిందెలతో గుమిగూడారు. వారికి సాయంగా పురుషులు కూడా చేరడం.. ఆ సమయంలోనే పెళ్లివారు అక్కడికొచ్చారు. రెండు నెలలుగా 15 రోజులకొకసారి మాత్రమే నీరు సరఫరా అవుతోందని అక్కడివారు చెప్పడంతో ఖంగుతిన్నారు.
దీంతో ఆలోచనలో పడిన యువతి తల్లిదండ్రులు.. ఈ గ్రామంలోని యువకుడితో తమ కుమార్తెకు వివాహం జరిపిస్తే ఆమె కూడా నీటికోసం పోట్లాడాల్సి వస్తుందేమోనని భయపడ్డారు. గుడికి వెళ్లిన తరువాత యువకుడి ఇంటికి వెళ్లాలని తీసుకున్న తమ నిర్ణయాన్ని విరమించుకున్నారు. అటు నుంచి అటే చెప్పాపెట్టుకుండా వెళ్లిపోయారు. అలా ఎందుకు చేస్తున్నారని కొందరు అడిగితే నీటి సమస్య ఇంత తీవ్రంగా ఉన్న గ్రామంతో వియ్యమందుకోవడం తమకు ఇష్టం లేదని తెగేసి చెప్పారు.
రెండు నెలలుగా ఆ గ్రామానికి 15 రోజులకు ఒకసారి తాగునీరు సరఫరా అవుతోంది. అమ్మాయి తరఫువారు పెళ్లిచూపులకు వచ్చిన రోజే నీళ్లు సరఫరా కావడంతో నీటి కోసం మహిళలు పెద్ద సంఖ్యలో బిందెలతో గుమిగూడారు. వారికి సాయంగా పురుషులు కూడా చేరడం.. ఆ సమయంలోనే పెళ్లివారు అక్కడికొచ్చారు. రెండు నెలలుగా 15 రోజులకొకసారి మాత్రమే నీరు సరఫరా అవుతోందని అక్కడివారు చెప్పడంతో ఖంగుతిన్నారు.